టిఆర్ఎస్ కు షాకిచ్చిన టైమ్స్ నౌ పార్లమెంటు సర్వే ఫలితాలు

దేశ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల హడావుడి మొదలైంది. పార్లమెంటు ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నా ఇప్పటి నుంచే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయోనంటూ చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు సర్వే సంస్థలు సర్వేలు చేసి ఆసక్తికర ఫలితాలు వెలువరించాయి. తాజాగా టైమ్స్ నౌ ఓపినియన్ పోల్ సర్వేను విడుదల చేసింది. ఈ సర్వే ఫలితాలు అన్ని పార్టీలను కలవరపెడుతున్నాయి.

2014 ఎన్నికల్లో బీజేపీకి సాధారణ మెజారిటీ దక్కగా, ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో బీజేపీ కూటమి (ఎన్డీయే)కు సాధారణ మెజారిటీ దక్కదని తేల్చింది. ఈ ఎన్నికల్లో  ప్రాంతీయ పార్టీలు కీలకం కానున్నాయని ఈ సర్వే అంచనా వేసింది. 545 మంది సభ్యులున్న లోక్ సభలో ఎన్డీయేకు 252 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 147 సీట్లు, ఏ కూటమిలో లేని ఇతరులకు 144 సీట్లు వస్తాయని తేల్చింది.  ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీల వారే కీలకమని పేర్కొంది. మరో మూడు నెలల్లో కాంగ్రెస్ పుంజుకొని విపక్షాల సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని సర్వే తన నివేదికలో తెలిపింది.

తెలంగాణలో టిఆర్ఎస్ కి 10, కాంగ్రెస్ 5, బిజెపి 1, ఇతరులు 1 స్థానాన్ని గెలుచుకుంటారని ఈ సర్వే స్పష్టం చేసింది. తెలంగాణలో అన్ని స్థానాలు గెలుచుకొని విజయఢంకా మోగిస్తామన్న కేసీఆర్ కు షాకిచ్చేలా ఈ సర్వే ఫలితాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వైసిపి 23, టిడిపి 2 స్థానాలు గెలుచుకుంటాయని ఈ సర్వే తేల్చింది.

ఇక రాష్ట్రాల వారీగా సర్వే అంచనాలను పరిశీలిస్తే…

ఉత్తరప్రదేశ్ (80 సీట్లు): ఏస్పీ – బీఎస్పీ కూటమి 51, ఎన్డీయే 27, ఇతరులు 2
మహారాష్ట్ర (48 సీట్లు): ఎన్డీయే 43, యూపీఏ 5.
పశ్చిమ బెంగాల్ (42 సీట్లు): టీఎంసీ 32, ఎన్డీయే 9, యూపీఏ 1.
బీహార్ (40 సీట్లు): ఎన్డీయే 25, యూపీఏ 15.
తమిళనాడు (39 సీట్లు): యూపీఏ (కాంగ్రెస్ – డీఎంకే) 35, ఏఐఏడీఎంకే 4.
కర్ణాటక (28 సీట్లు): యూపీఏ 14, ఎన్డీయే 14.
గుజరాత్ (26 సీట్లు): ఎన్డీయే 24, యూపీఏ 2.
ఆంధ్రప్రదేశ్ (25 సీట్లు): వైఎస్ఆర్ కాంగ్రెస్ 23, టీడీపీ 2.
రాజస్థాన్ (25 సీట్లు): ఎన్డీయే 17, యూపీఏ 8.
ఒడిశా (21 సీట్లు): ఎన్డీయే 13, బీజేడీ 8.
కేరళ (20 సీట్లు) యూడీఎఫ్ 16, ఎల్డీఎఫ్ 3, ఎన్డీయే 1.
తెలంగాణ (17 సీట్లు): టీఆర్ఎస్ 10, యూపీఏ 5, ఎన్డీయే 1, ఇతరులు 1.
జార్ఖండ్ (14 సీట్లు): యూపీఏ 8, ఎన్డీయే 6.
అసోం (14 సీట్లు): ఎన్డీయే 8, యూపీఏ 3, ఏఐయూడీఎఫ్ 2, ఇతరులు 1.
పంజాబ్ (13 సీట్లు): యూపీఏ 12, ఆప్ 1.
ఛత్తీస్ గఢ్ (11 సీట్లు): యూపీఏ 6, ఎన్డీయే 5.
హర్యానా (10 సీట్లు): ఎన్డీయే 8, యూపీఏ 2.
ఢిల్లీ (7 సీట్లు): ఎన్డీయే 6, ఆప్ 1.
జమ్ము కాశ్మీర్ (6 సీట్లు): నేషనల్ కాన్ఫరెన్స్ 4, యూపీఏ 1, ఎన్డీయే 1.
ఉత్తరాఖండ్ (5 సీట్లు): ఎన్డీయే 5.
హిమాచల్ ప్రదేశ్ (4 సీట్లు): ఎన్డీయే 3, యూపీఏ 1.
అరుణాచల్ ప్రదేశ్ (2 సీట్లు): ఎన్డీయే 2.
మణిపూర్ (2 సీట్లు): యూపీఏ 1, ఎన్డీయే1.
త్రిపుర: (2 సీట్లు): ఎన్డీయే 2.
గోవా (2 సీట్లు): ఎన్డీయే 1, యూపీఏ 1.
నాగాలాండ్ (1 సీటు): ఎన్డీయే 1.
మిజోరం (1 సీటు): ఎన్డీయే 1.
సిక్కిం (1 సీటు): ఇతరులు 1.
దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు డామన్, డయ్యూలోని ఒక్కో సీటును ఎన్డీయే గెలుచుకుంటుందని టైమ్స్ నౌ – వీఎంఆర్ ఒపీనియన్ సర్వే అంచనా వేసింది. ఈ సర్వే ఫలితాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *