నోటికి పనిచెప్పిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ (వీడియో)

ఒకవైపు ఎన్నికలు దగ్గరపడుతుండగా మరోవైపు తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. ఎమ్మెల్యేలు అనేక సందర్భాల్లో నోటికి పనిచెప్పుతూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. డోర్నకల్ ఎమ్మెలయే రెడ్యానాయక్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.

గతంలో ఒక గ్రామంలో గిరిజనులు రెడ్యానాయక్ ను తరిమిన ఘటన మరువక ముందే మరో వివాదాస్పద సంఘటనతో మీడియాకు ఎక్కారు రెడ్యానాయక్. నియోజకవర్గంలోని వెన్నారం గ్రామ శివారు రముతండా లో ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా అన్ని తండాల్లో ట్యాంకులు కట్టి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు అందిస్తామన్నారు.

ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతున్న సందర్భంలో స్థానికుడు తమ సమస్యలు విన్నవించే ప్రయత్నం చేశారు. దీంతో ఎమ్మెల్యేకు చిరాకు వచ్చింది. ఆ వ్యక్తిపై ఎలా బూతులు తిట్టారో వీడియోలో చూడండి. పైగా ‘‘ఎస్సై ఎటు పోయిండు.. వాడు నకరాల్ చేస్తుండు లోపలేయండి’’ అంటూ చిందులేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *