జగన్ పై వంగవీటి రాధా సెన్సేషనల్ కామెంట్స్

ఏపీలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. ఇంకా పది రోజులు మాత్రమే ఉండటంతో ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు నేతలు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా మరోసారి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ని ఓడించడమే ధ్యేయంగా టీడీపీ తరపున ప్రచారం చేస్తాను, పోటీ చేయను అని చెప్పిన రాధా పలు ప్రచార సభల్లో పాల్గొంటున్నారు.
2019 ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పుతో జగన్ కు వణుకు పుట్టి హైదరాబాద్ లోటస్ పాండ్ పారిపోవాలని, ఈ ఎన్నికల్లో మనమేంటో జగన్ కి చూపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. “జగన్ జాగ్రత్తగా ఉండు, ఎన్నికల్లో ప్రజాతీర్పు ద్వారా నిన్ను తరిమికొట్టడం ఖాయం” అని జగన్ ని హెచ్చరించారు. నీతికి, అవినీతికి మధ్య ఎన్నికల పోరాటం జరుగుతోందని, ప్రజలే సరైన తీర్పు ఇవ్వాలని కోరారు.
స్వప్రయోజనాల కోసం కేంద్రంతోనూ, కెసిఆర్ తోనూ చేతులు కలిపి రాష్ట్ర గౌరవాన్ని జగన్ తాకట్టు పెట్టారని విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీకి, పార్లమెంటుకి వెళ్లకుండా ప్రజల్ని మోసం చేసిందని అన్నారు. క్రిమినల్ జగన్ కి ఓటేస్తే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి అంటూ జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు వంగవీటి రాధాకృష్ణ.

 

ఇది కూడా చదవండి…

https://trendingtelugunews.com/trs-kavitha-hot-commentes-on-modi/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *