మహిళా జర్నలిస్ట్ రేవతిని జైలులో కలిసిన కోదండరాం

మోజో టివి మాజీ సీఈఓ రేవతిని శుక్రవారం చంచల్ గూడ మహిళ జైల్ లో మూలాఖత్ ద్వారా తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం కలిశారు. ఆయనతో పాటు తెలంగాణ జన సమితి నాయకుల బృందం కలిసి పరామర్శించారు. ఆమెపై పెట్టిన కేసుల గురించి కోదండరాం అడిగి తెలుసుకున్నారు. ఈ బృందంలో టీజేఎస్ రాష్ట్ర నాయకులు వెంకట్ రెడ్డి, బైరీ రమేష్, మమత రెడ్డి తదితరులు ఉన్నారు.