బిగ్ బ్రేకింగ్: లక్ష్మీపార్వతిపై లైంగిక వేధింపుల కేసు (వీడియో)

Opఎన్టీఆర్ భార్య, వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతిపై వినుకొండలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. లక్ష్మీ పార్వతి కొంతకాలంగా నన్ను లైంగికంగా వేధిస్తోంది అంటూ కోటి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్నికలు దగ్గర్లో ఉన్న సమయంలో ఆమెపై ఇలాంటి కేసు నమోదవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. అందునా ఆమె కోట్లాది మంది ఆరాధించే నటుడు, దివంగత సీఎం భార్య కావడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కింద ఉన్నాయి చదవండి.

లక్ష్మీ పార్వతిపైన కేసు నమోదు చేసింది ఎవరో కాదు కొంతకాలంగా, తనకి ముఖ్య అనుచరుడిగా వ్యవహరిస్తోన్న కోటి అనే వ్యక్తి. మిమ్మల్ని నా తల్లిగా భావిస్తున్నానని, ఇలాంటివి వద్దని వేడుకున్నా వినడం లేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. నేను చెప్పినట్టు వింటే వైసీపీలో ముఖ్య పదవి ఇప్పిస్తానని, లేదంటే… అంటూ బెదిరింపులకు పాల్పడుతుంది అంటూ ఆయన ఆరోపించాడు.

ఐదేళ్ల క్రితం సినిమాకు సంబంధించిన పని మీద ఆమెని కలిశానని, ఆమెతో మాట్లాడినప్పటి నుండి ఆమెపై నాకు తల్లిలాంటి భావన కలిగిందని చెప్పాడు. ఆమె మీద ఏర్పడిన అభిమానంతో లోకల్ గా ఆమెకు ఏదైనా పనులుంటే చేసిపెట్టేవాడినని, ఆమెకు సహాయంగా ఉండేవాడినని తెలిపాడు. నేను ఆమెను తల్లిలా భావిస్తుంటే ఆమె మాత్రం నన్ను కామంతో చూసిందని, వాట్సాప్ చాటింగ్ లో లైంగికంగా వేధిస్తోందని, బెదిరింపులకు పాల్పడుతోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు కోటి. ఆమె బెదిరింపులు ఎక్కువయ్యాయని, నన్ను రక్షించాలని ఆధారాలతో సహా వినుకొండ పోలీసులను ఆశ్రయించాడు.

ఇది కూడా చదవండి

కెసిఆర్ గత ప్రభుత్వం పనితీరు

Below average

https://bit.ly/2K9Jkqg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *