కేసీఆర్ పనికి మాలినోళ్ళనే మంత్రులుగా పెట్టుకున్నాడు : రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో మంగళవారం ఈడీ విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ, కెసిఆర్ లు కలిసి తనపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఆయన మీడియాతో ఏం మాట్లాడారో కింద ఉంది చదవండి.

అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. రేపు కూడా మళ్లీ విచారణకు రమ్మన్నారు. రేపు కూడా విచారణకు హాజరై అన్ని సమాదానాలు చెపుతాను.కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఎన్నికలప్పుడు ఐటి అధికారులను ప్రయోగించారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇపుడు ఈడీని ప్రయోగిస్తున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు రేవంత్.

మోదీ,కేసీఆర్ లది పెవికాల్ బంధం. ఎంఎల్ సీ ఎన్నికలప్పుడు ఏసీబీ ని ఉపయోగించి కేసీఆర్ గెలిచాడు. మొన్న జరిగిన ఎన్నికల్లో అనేక ఆక్రమాలకు పాల్పడ్డాడు. తల తెగి పడ్డా కేసీఆర్ ఆక్రమాలపై మాట్లాడుతా. నీ కర్మ కాలిన రోజు నువు ఊచలు లెక్కపెడుతావు. అప్పుడు మోదీ కూడా నిన్ను కాపాడలేడు. మోదీ మోజు పడి కేంద్ర దర్యాప్తు సంస్థలతో గంటల కొద్ది విచారిస్తున్నారు అని విమర్శించారు.

చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత మళ్లీ కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరుపుతున్నారు. విచారణ పూర్తయిన తర్వాత మూడో కృష్ణుడు ఈడీ ఏం తేల్చుతుంది. వేం నరెందర్ రెడ్డి పిల్లలను ఎందుకు పిలిచారు? రాజకీయ సంబంధాలు లేని వారిని పిలిచి మా కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారు. అధికారంలో ఉన్న కొద్దిమంది పెద్దలు చేస్తున్న ఈ కుట్రలను తెలంగాణ ప్రజలు గ్రహించాలి అని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్.

నా మీద పోటీ చేసిన నరేందర్ రెడ్డి వద్ద 51 లక్షలు దొరికాయి. దానిపై ఈడీ, సీబీఐకి ఎందుకు పిర్యాదు చేయలేదు అని నిలదీశారు రేవంత్. మోదీ,కేసీఆర్ లపై వ్యతిరేకంగా పోరాడుతున్న వారినే దర్యాప్తు సంస్థలు వేదిస్తున్నాయి అంటూ ఆరోపించారు. హరిష్, తుమ్మల, కడియంకు మంత్రి పదవులు ఇవ్వరని నిన్ననే చెప్పా. పనికి మాలినోళ్లను మంత్రులుగా పెట్టుకున్నాడు కెసిఆర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *