సతీమణితో కలిసి లండన్ వెళ్లిన వైసీపీ అధినేత జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతితో కలిసి లండన్ వెళ్లారు. బుధవారం తెల్లవారుఝామున నాలుగు గంటలకు బ్రిటిష్ ఎయిర్ వేస్ లో ఆయన లండన్ పయనమయ్యారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుతున్న కుమార్తె వర్షా రెడ్డిని చూసివచ్చేందుకు వెళ్లారు.

గత నెలలోనే ఆయన లండన్ వెళ్లాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో చోటు చేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల రీత్యా ఆయన లండన్ పర్యటన వాయిదా పడింది. సిబిఐ కోర్టు ముందస్తు అనుమతితో జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. తిరిగి ఫిబ్రవరి 26 న హైదరాబాద్ చేరుకుంటారు. ఆయన వచ్చేవరకు పార్టీ బాధ్యతలన్నీ ముఖ్యనేతలు చూడనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *