కాంగ్రెస్ అంజన్ కుమార్ మీటింగ్ లో డిష్యూం డిష్యూం (వీడియో)

ప్రపంచ చరిత్రలో అంతర్గత ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరైన పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. ఆ పార్టీలో ఎంత పెద్ద మొనగాడైనా సరే కార్యకర్తలు లెక్క చేయరు. విమర్శలు చేయడంలో వెనుకంజ వేయరు. అవసరమైతే బస్తీ మే సవాల్ అని కలబడడంలో కూడా వెనుకడుగు ఉండదు. కాంగ్రెస్ నాయకుల మీటింగ్ లో ఫైటింగ్ లేకుండా ప్రశాంతంగా జరిగిన దాఖలాలు చాలా అరుదుగా ఉంటాయి.

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సమావేశంలో డిష్యూం డిష్యూం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నారు. అంజన్ కుమార్ యాదవ్ వేదిక మీద ఉండగానే ఆయన సమక్షంలోనే ఫైటింగ్ జరిగింది.

సికింద్రాబాద్ పరిధిలోని లాలాపేట్ లో గురువారం ఎన్నికల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రెండు వర్గాలుగా చీలిపోయిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. వారి వీడియో కింద ఉంది చూడొచ్చు.

 

ఈ ట్రెండింగ్ స్టోరీ చదవండి…

https://trendingtelugunews.com/kcr-serious-on-telangana-revenue-staff/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *