హిందూపూరంలో బాలయ్య వ్యూహం, ప్రచారంలో భార్య వసుంధర

అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఈసారి ఎన్నికను ప్రతిష్టాకరంగా తీసుకుంటున్నారు.

ఈ ఎన్నికల్లో ఆయనను ఓడించేందుకు వైసిపి మాజీ ఐఎఎస్ అధికారి ఇక్బాల్ ని రంగంలోకి దించింది. ఎటువంటి చెడ్డ పేరులేని ఇక్బాల్ ముస్లింల వోట్లు కాజేస్తారనే భయం టిడిపిలో ఉంది.దానికి తోడు బాలకృష్ణ నియోజకవర్గాన్ని అసలు పట్టించుకోవడం లేదని, అది పిఎ రాజ్యంగా మారిపోయిందని పేరుంది.

పిఎ విపరీతంగా అవినీతికి పాల్పడి  ప్రజలకు సాయం చేయకపోగా  కోపంగా ప్రవర్నించేవాడని అపకీర్తి వచ్చింది. దీని మీద చాలా గొడవయింది కూడా.ఇపుడేమో వైసిపి తప్పనిసరిగా ఓడించాలని టార్గెట్ పెట్టుకున్న సీట్లలో హిందూపూరం ఒకటి కావడంతో బాలకృష్ణ ప్రచారం రూటు మార్చారు.

ఏకంగా ఆయన భార్యను ప్రచారంలోకి దించారు. తరుపున ఆయన భార్య వసుంధరా దేవి పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు.

అంబికా లక్ష్మీనారాయణ సతీమణి శ్యామలతో కలిసి ఇంటింటా తిరుగుతూ టిడిపి సైకిల్ గుర్తుకు ఓటు వేసి బాలకృష్ణ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. బాలకృష్ణ సతీమణి స్వయంగా రంగంలోకి దిగడంతో ప్రచారానికి విశేష స్పందన వస్తున్నది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *