రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ ఆఫీసర్స్ నిరసన

రాష్ట్ర వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ ఆఫీసర్స్
మేము సైతం అంటూ కదులుతున్న తెలంగాణ జిల్లాల నర్సింగ్ ఆఫీసర్స్
ప్రభుత్వ ఆధ్వర్యంలో నియమించే నర్సులను ఔట్‌ సోర్సింగ్‌ లేదా కాంట్రాక్ట్‌ పద్ధతిలో కాకుండా రెగ్యులర్‌ విధానంలో భర్తీ చేయాలంటూ డిమాండ్ 
మన నర్సింగ్ ఆఫీసర్స్ ఎవ్వరు కూడా ఈ తాత్కాలికంగా నియమించే పోస్టులలో జాయిన్ అవ్వకూడదు అంటూ పిలుపు 
హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై ప్రభుత్వం చొరవ తీసుకుని 3,311 నర్సు పోస్టులను భర్తీ చేయాలి

వైద్యులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పించి అమరుడైన డాక్టర్ నరేష్, నర్సింగ్ ఆఫీసర్ జయమణికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా వెంటనే ప్రకటించాలి. వారి కుటుంబంలో ఒకరికి జాయింట్ కలెక్టర్ ఉద్యోగం కల్పించాలి. 500 గజాల స్థలాన్ని వారి ఇంటి నిర్మాణం కొరకు ఇవ్వాలి. వారి ఇద్దరు పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి.
రాష్ట్ర వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి కరోనా వైరస్ మహమ్మారిపై యుద్ధం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి సంఘీభావం ప్రకటించాలి.

కరోనా పై యుద్ధం లో అమరుడైన డాక్టర్ నరేష్, నర్సింగ్ ఆఫీసర్ జయమణి కి అశ్రునివాళి ఘటించాలని కోరుతూ.. రాష్ట్రంలో ఉన్న ప్రతి నర్సింగ్ ఆఫీసర్ ఉన్నచోటనే బ్లాక్ రిబ్బన్ లేదా బ్లాక్ జెండా పట్టుకొని తమ నిరసన వ్యక్తం చెయ్యాలి అని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తుంది.
అలాగే నిరసన వ్యక్తం చేస్తున్న ఫోటోలను, వీడియోలను తమ సోషల్ మీడియాలో పోస్టు చెయ్యాలి లేదా అసోసియేషన్ వారి వాట్సప్ నంబర్ కు పంపగలరు : 9700015427 అని ట్రైన్డ్ నర్సస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (తెలంగాణ రాష్ట్ర శాఖ ) రిజిస్టర్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ( ప్రభుత్వ ఉద్యోగుల సంఘం) మరియు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది.
ఇది కూడా చదవండి

రష్యా కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది, తొలివిడత ప్రయోగంలో దేశాధ్యక్షుడి బిడ్డ