అమెరికా సరస్సులో గల్లంతైన విశాఖ యువకుడు

విశాఖపట్నం కు చెందిన స్టీల్‌ ప్లాంట్‌ టౌన్‌షిప్ ఎ.వెంకటరావు కుమారుడు అవినాష్ అమెరికాలో మృతి చెందాడు.

ఉన్నత విద్యాభ్యాసం కోసం ఐదేళ్ల కిందట అవినాష్ అమెరికా వెళ్ళాడు.

ఇటీవల కాలంలో ఎంఎస్‌ పూర్తి చేసిన ఆయన ఉద్యోగంలో చేరారు.

రెండు రోజుల కిందట స్నేహితులతో కలిసి ఓ సరస్సులో బోటు షికారుకు వెళ్లి మృత్యు వాత పడ్డాడు అవినాష్.

సరస్సు లోతుగా ఉండటం, ఊబి కూడా ఉండటంతో అవినాష్ గల్లంతయ్యాడని కుటుంబసభ్యులకు సమాచారమిచారు అవినాష్ స్నేహితులు.

కొడుకు మరణవార్త విన్న తల్లిదండ్రులు తల్లడిల్లుపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *