కాంగ్రెస్ ఉత్తమ్ కు కేసిఆర్ స్ట్రాంగ్ ఛాలెంజ్

తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ సిఎం కేసిఆర్ స్ట్రాంగ్ చాలెంజ్ విసిరారు. ప్లీనరీ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కేసిఆర్ నిప్పులు చెరిగారు. ప్లీనరీలో ఆయన ఏమన్నారో కింద చదవండి.

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు. టిపిసిసి అనే పోస్టు వచ్చిందంటే అది తెచ్చింది గులాబీ జెండానే. ఆనాడు మేము పోరాటం చేయకపోతే టిపిసిసి రాదు. నీకు టొపిసిసి రాదు. మేం పోరాటం చేయకపోతే నీకు ఆ పదవి రాదు. నువ్వు ఆంధ్రా నేతలకు సంచులు మోసుకుంట బతకాల్సిందే.

14 ఏండ్ల అలుపెరగని మడమ తిప్పని పోరాటమే నేడు తెలంగాణ రాష్ట్రం. అన్నం తిన్నమో అటుకులు బుక్కినమో పోరాటం చేసి తెలంగాణ సాధించినం. ఉత్తమ్ కుమార్ రెడ్డీ.. ఒల్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. అబద్ధాలు చెప్పడానికి కూడా తెలివి తేటలు కావాలి. అబద్ధాలు చెప్పడానికి ఉత్తమ్ కు తెలివితేటలు లేవు. ఆయనకు అసలు ఎట్ల మాట్లాడాలో కూడా తెల్వదు. ఏం మాట్లాడిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి బస్సు యాత్రలో. కేసిఆర్ 150 రూములతో ప్రగతి భవన్ కట్టుకున్నడు అని మాట్లాడుతడా? సిగ్గుండాలె ఉత్తమ్ కుమార్ రెడ్డికి.

సాంయంత్రం ఐదారుగ గంటలకు ప్లీనరీ సభ అయిపోతది. ఏడున్నరకు ఉత్తమ్ కుమార్ రెడీ.. నువ్వు మీడియాను తీసుకుని ప్రగతిభవన్ కు రా. 150 రూములు ఉన్నాయేమో చూపించు. 150 రూములు లేకపోతే నువ్వు అక్కడనే ముక్కు నేలకు రాయాలి. ఉంటే నేను వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు సిగ్గుచేటు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *