కేటిఆర్ బంధువుని అంటూ.. ఎలా తిట్టిండు.. కొట్టిండంటే ? (వీడియో)

తాను కేటిఆర్ బంధువునంటూ రెవెన్యూ అధికారులపై దాడికి దిగిన ఘటన హైదరాబాద్ పరిసరాల్లోని దూలపల్లి గ్రామంలో జరిగింది. రంగారావు అనే వ్యక్తి రెవెన్యూ అధికారులను, సిబ్బందిని బెదిరించడంతోపాటు చితకబాదాడు. రంగారావు దూలపల్లిలో చెరువు శిఖం భూములు ఆక్రమించి అక్రమ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఆ భూముల్లో కడుతున్న ఇండ్లను కూల్చేందుకు వెళ్లిన రెవెన్యూ ఇన్స్ పెక్టర్ రేణుక ను దూషించాడు. విఆర్ఎ ను చితకబాదాడు రంగారావు.

అంతేకాదు నేను కేసిఆర్ కు చెప్పి మిమ్మల్ని ఒక్కరోజులో సస్పెండ్ చేయించకపోతే చూడండి బాంచెత్ అంటూ బెదిరించాడు. రంగారావు ఎలా రెచ్చిపోయిండో కింద ఉన్న వీడియోలో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *