ముఖ్యమంత్రి కెసిఆర్ ఫార్మ్ హౌస్ కు కూత వేటు దూరంలో ఉన్న హకీం పేటకు వెళ్ళి కర్నల్ సంతోష్ కుమార్ అంత్యక్రియలకు తెలంగాణ సీఎం కెసిఆర్ ఎందుకు హాజరు కాలేదనే ఇపుడు చర్చనీయాంశమయింది. నిన్న చాలా మంది ప్రముఖలు ఆయన అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పరించారు. అయితే,కెసిఆర్ కనిపించకపోవడం కట్టొచ్చినట్లు కనిపించింది. దీనిని కాంగ్రెస్ నేతలు ఎత్తి చూపుతున్నారు. నిన్న నల్గొండ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కర్నల్ సంతోష్ అంత్యక్రియలకు హాజరయి నివాళులర్పించాక ఇదే ప్రశ్న లేవనెత్తారు. ఛత్తీష్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ (కింది ఫోటో) ఆ రాష్ట్ర అమరజవాన్ పాడె భూజాన మోసి తన గౌరవమేమిటో చాటారని కాంగ్రెస్ చెబుతూ ఉంది.
शहीद स्व. श्री गणेश राम कुंजाम की स्मृति को अक्षुण्य बनाए रखने के लिए गांव की शाला का नामकरण उनके नाम पर करने की घोषणा करता हूँ।
– शहीद श्री कुंजाम के परिवार के एक सदस्य को शासकीय नौकरी दी जाएगी
– शहीद के पिता को छत्तीसगढ़ शासन की ओर से 20 लाख रूपए की अनुग्रह राशि प्रदान की गयी https://t.co/nlUIQkes59
— Bhupesh Baghel (@bhupeshbaghel) June 18, 2020
గాల్వాన్ లోయలో భారతీయ సైనికుల మీద చైనా జరిపిన ఇదే దాడిలో ఒడిషా నుంచి ఇద్దరు జవాన్లు అమరలయ్యారు. వారికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా నివాళులర్పించారు.
