ఇకనైనా ఉత్తరాంధ్ర గోడు ఆలకించండి : కొణతాల రామకృష్ణ

నీళ్లు, నిధులు, నియామకాల్లో వెనుక బడిన ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలే, అవశేష ఆంధ్ర ప్రదేశ్‌ లో కూడా జరుగుతున్నాయి.
రాష్ట్రంలో నూత నంగా ఏర్పడిన వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ”ఉత్తరాంధ్ర గోడు” ఆలకించి, దానిపై ద ష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది, లేనిపక్షంలో సమీప భవిష్యత్‌ లోనే ఈ ప్రాంత ప్రజలలో చెలరేగుతున్న అసంత ప్తి తీవ్రమై ఉద్యమబాట పట్టే అవకాశం వుంది.
అవశేష ఆంధ్రప్రదేశ్‌లోనే ఉత్తరాంధ్ర అత్యంత వెనుకబడిన ప్రాంతం అనడంలో ఎవ్వరికీ సందేహం లేదు. పుష్కలమైన సహజ వనరులు ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర వెనుకబడి ఉండటం, కనీసం మౌలిక సదుపాయాలకు నోచుకోలేక పోవడం ఈ ప్రాంత ప్రజల దుస్థితికి తార్కాణం. ఈ విషయాన్నే జస్టిస్‌ శ్రీక ష్ణ కమిషన్‌ తమ నివేదికలో స్పష్టంగా గణాంకాలతో సహా పేర్కొన్నది.
ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు, నిర్లక్ష్యం అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొనసాగు తున్నాయి. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే ఉత్తరాంధ్ర ఉత్త ఆంధ్ర’గా మారిపోయే ప్రమాదం ఉన్నది.
రాష్ట్రంలో ఏప్రిల్‌ మాసంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ద ష్టిలో ఉంచుకుని ”ఉత్తరాంధ్ర అజెండా – 2019 ఎన్నికలు” అంశంపై మూడు జిల్లాల్లో కూడా ఉత్తరాంధ్ర చర్చ వేదిక ఆధ్వర్యంలో సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేశాము.
”ఉత్తరాంధ్ర గోడు”ను ఒక అజెండాగా రూపొందించి అన్ని రాజకీయ పార్టీలకు ఫిబ్రవరి 28 వ తేదీన ఇచ్చి, తమ తమ ఎన్నికల ప్రణాళికలలో ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను పొందుపరిచి ”ఉత్తరాంధ్ర గోడును ఆలకించమని” కోరాము. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలకు, మద్యం, డబ్బు పంపిణీ తదితర అంశాలకే అన్ని రాజకీయ పార్టీ లు ప్రాధాన్యత ఇచ్చాయి తప్ప ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు ఏ ఒక్కరు ప్రాధాన్యత ఇవ్వక పోవడం ఈ ప్రాంతం పట్ల అన్ని రాజకీయ పార్టీలకు వున్న సవతి తల్లి ప్రేమకు నిదర్శనం.
ఉత్తరాంధ్ర డిక్లరేషన్   
ఉత్తరాంధ్ అభివృ ద్ధికి ఎన్నో ఏళ్లుగా విశేషంగా క షి చేస్తున్న ప్రొఫెసర్‌ కె.ఎస్‌.చలం, రిటైర్డ్‌ ఐ.ఏ.ఎస్‌ అధికారి ఈ.ఏ.ఎస్‌.శర్మ, ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.వి.రమణ, మాజీ ఎంపీ డా. కె.శంకరరావు, రిటైర్డ్‌ ఇంజనీర్‌ సత్యనారాయణ, నన్నయ యూనివర్సిటీ మాజీ విసి ప్రొఫెసర్‌ ముత్యాలనాయుడు తదితరులు ”ఉత్తరాంధ్ర డిక్లరేషన్‌”ను రూపొందించి మార్చి రెండవ వారంలో విడుదల చేశారు.
నిపుణులు రూపొందించిన ”ఉత్తరాంధ్ర డిక్లరేషన్‌”ను నూతన ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి అధ్యయనం చేసి ఉత్తరాంధ్ర గోడును అర్ధం చేసుకుని ఈ ప్రాంత అభివ ద్ధిపై ప్రత్యేక ద ష్టిని సారించాలి.
ఉత్తరాంధ్ర ప్రజల ప్రధానమైన ఆకాంక్ష జలవనరులు. ఏ ప్రాంతమైనా అభివ ద్ధి చెందాలంటే సాగునీరు, త్రాగునీరు ఎంతైనా అవసరం. బహుదా, మహేంద్ర తనయ, వంశధార, నాగావళి, పెద్ద గెడ్డ, కందివలస గెడ్డ, చంపావతి, జంజావతి, సీలేరు, శబరి, గోస్తని, నర్వగెడ్డ, శారద, వరాహ, తాండవ వంటి జీవ నదులకూ నిత్యం ప్రవహించే సెలయేళ్ళకూ ఆలవాలమైన, రాష్ట్రం మొత్తంలోకి అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఉత్తరాంధ్రలో వ్యవసాయానికి నీటి పారుదల సౌకర్యాలు కనీస స్థాయిలో కూడా లేవు. ఈ నదులలో, సెలయేళ్లలో ప్రవహించే జలాలను సక్రమంగా వినియోగిస్తే ఉత్తరాంధ్రలో సాగుకు అనువైన ప్రతి ఎకరానికి నీటి పారుదల సౌకర్యం కలిగించ వచ్చు.
ఉత్తరాంధ్రను వ్యవసాయోత్పత్తులలో అన్నపూర్ణగా మార్చవచ్చు. దాదాపు యాభై ఎనిమిది లక్షల ఎకరాల ఉత్తరాంధ్ర విస్తీర్ణంలో ఇరవై నాలుగు లక్షల ఎకరాలు సాగుకు అనుకూలం కాగా, ప్రస్తుతం అందులో ఎనిమిది లక్షల ఎకర ాలకు కూడా కాలువల కింద సాగునీటి పారుదల సౌకర్యం లేదు. అయితే అత్యంత ప్రాధాన్యత గల సాగునీటి ప్రాజక్టు నిర్మాణంపై ఉమ్మడి రాష్ట్రంలో, అవశేష ఆంధ్రప్రదేశ్‌లో నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతం వెనుకబడిపోతోంది.
5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి
వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివ ద్ధికి జీవనాడి బాబూ జగ్జీవన్‌ రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు. డా.వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అంతేకాకుండా వలసలను కూడా అరికట్టవచ్చు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను తక్షణమే ప్రారంభించి, నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుతున్నారు.రు.
వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తానని అంటున్న నూతన ప్రభుత్వం ఉత్తరాంధ్ర లోని పంట భూములన్నిటికీ సాగునీరు, అన్ని పట్టణాలకూ, గ్రామాలకూ తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ రాష్ట్ర బడ్జెట్‌లో సంవత్సరానికి కనీసం 5 వేల కోట్ల రూపాయలను కేటాయించి వెనుక బడిన ప్రాంతాల అభివ ద్ధి పట్ల తమ చిత్తశుద్ధిని చాటు కోవాలి. సాగునీటికి, తాగునీటికి ఉద్దేశించిన పథకాలను పరిశ్రమలకు, ఇతర అవసరాలకు ఎట్టి పరిస్థితులలోనూ మళ్ళించకూడదని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఉత్తరాంధ్రలో ప్రవహించే నదుల్లో ఎక్కువ భాగం ఒరిస్సాలో పుట్టిన అంతర్రాష్ట్ర నదులు కనుక ఆ రాష్ట్రంతో చర్చలకు, సామరస్యపూర్వకంగా పరిష్కారానికి ప్రయత్నించి ఉత్తరాంధ్ర ప్రజల హక్కులను పరిరక్షించాలి.
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో తాజా గణాంకాల ప్రకారం రాష్ట్ర సగటు అక్షరాస్యత (67.4 శాతం) కన్నా తక్కువ అక్షరాస్య తతో (విశాఖపట్నం 66.9 శాతం, శ్రీకా కుళం 61.7 శాతం, విజయనగరం 58.9 శాతం) ఉన్నాయి. అందులోనూ రాష్ట్రంలోని 13 జిల్లాలలో అక్షరాస్య తలో విజయనగరం 13వ స్థానంలో, శ్రీకాకుళం 11వ స్థానంలో, విశాఖపట్నం 8వ స్థానంలో ఉన్నా యంటే విద్యా రంగంలో ఉత్తరాంధ్ర ఎంత వెనుకబడి ఉందో స్పష్టమవుతుంది.
పంతొమ్మిదో శతాబ్ది చివరికి విద్యల నగరంగా ఉండిన విజయనగరం ఇరవయ్యొకటో శతాబ్దిలో అక్షరాస్యతలో చిట్టచివరికి చేరడం, దాన్ని సవరించడానికి ఏ ఒక్కరూ ప్రయత్నిం చకపోవడం, తగిన నిధులు కేటాయించి విద్యా సౌకర్యాలు కలిగిం చకపోవడం కొట్టవచ్చినట్టు కనబడు తున్నాయి. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యారంగం లోనూ, కళాశాల, విశ్వవిద్యాలయాల ఉన్నత విద్యారంగం లోనూ ఈ నిర్లక్ష్యం కొనసాగుతూనే వుంది. నూతన ప్రభుత్వం ”అమ్మఒడి” తదితర కార్యక్రమాల ద్వారా విద్యారంగంలో వెనుకబడిన ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలి.
అరకు డిక్లరేషన్ అమలుచేయాలి

ఉత్తరాంధ్రలో గణ నీయమైన సంఖ్యలో ఆదివాసీ జనాభా ఉంది. మూడు జిల్లాలలోనూ ఆదివాసీ ప్రాంతాలున్నాయి. ఆదివాసుల అభివ ద్ధి కోసం 2012 లో విడుదల అయిన అరకు డిక్లరేషన్‌ ఆదివాసీ ప్రాంతాలలో అమలుచేయవలసిన అభివ ద్ధి పథకాల గురించి, విధానాల గురించి వివరమైన సూచనలు చేసింది. ఆ సూచనలు ఇంతవరకూ అమలులోకి రాలేదు. ఆదివాసీ ప్రాంతాల ప్రత్యేక అస్థిత్వాన్ని పరిరక్షించే చర్యలు చేపట్టడం, 1/70 చట్టాన్ని ఉల్లంఘిస్తూ అన్యాక్రాంతమైన ఆదివాసీ భూములను తిరిగి ఆది వాసులకు అప్పగించడం, రాజ్యాంగం 73, 74 సవరణల ప్రకారం, పంచాయితీ రాజ్‌ ఎక్సటెన్షన్‌ టు షెడ్యూల్డ్‌ ఏరియాస్‌ చట్టం ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో పంచాయితీపాలనను ప్రవేశపెట్టడం, గిరిజన విశ్వవిద్యా లయాన్ని ఏర్పాటు చేయడం, బాక్సయిట్‌ తవ్వకాలను ఆపి వేయడం వంటి ఎన్నో డిమాండ్లను ఆదివాసులు ముందుకు తెస్తున్నారు. ఆదివాసీల గోడును నూతన ప్రభుత్వం ఆలకించి వారి ఆకాంక్షలకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టాలి.

ఉత్తరాంధ్రకు నీళ్లు, నిధులు, నియామకాలలో నిర్దిష్టమైన వాటాను కేటాయించవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014, సెక్షన్‌ 46 (3) లో నిర్దేశించినట్టుగా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీలు ప్రకటించాలి. ఆ ఆర్ధిక ప్యాకేజీ, ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ లో కనీసం 15 శాతం (విస్తీర్ణాన్ని బట్టి) నుంచి 20 శాతం (జనాభాను బట్టి) ఉండాలి. అంటే, ఆంధ్ర ప్రదేశ్‌ బడ్జెట్‌ ప్రకారం ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ రూ.22,000 కోట్ల నుంచి రూ. 30,000 కోట్లు ఉండాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు బుందేల్‌ ఖండ్‌, బోలంగీర్‌-కలహండి-కోరాపుట్‌ తరహా ఆర్ధిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఈశాన్య రాష్ట్రాలకు ఉన్న విధంగా ఈ రెండు ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి గల అభివ ద్ధి మండలిలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.
ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెలుగులు నింపే, ఉత్తరాంధ్ర ప్రజల జీవన ప్రమాణా లను మెరుగుపరిచే అనేక అభివ ద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలుకావాలంటే, నూతన ప్రభుత్వం వైపు నుంచి ప్రత్యేకించి అదే లక్ష్యంగా గల ఉత్తరాంధ్ర అభివ ద్ధి మండలి ఏర్పాటు చేయాలి. ఈ మండలిలో చిత్తశుద్ధిగల వారిని నియమించాలి. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను, వారి గోడును ఆలకించేవారిని ఈ మండలిలో భాగం చేయాలి. విద్య, ఉపాధి, తదితర రంగాలలో స్థానికుల హక్కులను కాపాడాలి. అందుకోసం వారికి తగిన రిజర్వేషన్లను కల్పించాలి. నూతన ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్న స్థానికులు, స్థానికేతరుల సంఖ్యను ముందుగా తేల్చాలి. విద్య, ఉద్యోగ, ఉపాధిలలో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలి.
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పూర్తి స్థాయిలో, లాభదాయకంగా పనిచేసేందుకు వీలుగా క్యాప్టివ్‌ మైన్‌ లను ఏర్పరచాలి. హై కోర్ట్‌ బెంచ్‌ ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలి. ఉత్తరాంధ్ర భాష, పలుకుబడిలని పరిరక్షించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ఉత్తరాంధ్ర భాష, యాసలను కించపరిచే విధంగా వస్తున్న సినిమాల, ఇతర ప్రచార, ప్రసార మాధ్యమాలపై నూతన ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ఉత్తరాంధ్రలో మత్యకారులపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలి. ముఖ్యంగా వారికి కేటాయించిన భూములను అక్రమంగా స్వాధీన పరచుకొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉత్తరాంధ్రలో రెల్లి కులస్థులు అధిక శాతంలో ఉన్నారు. వీరి అభివ ద్ధి కోసం రెల్లి కార్పొరేషన్‌ ను ఏర్పాటు చేయాలి. ఉత్తరాంధ్రంలో, ముఖ్యంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకోవాలి. భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
విమ్స్ ని నిమ్స్ గా మార్చాలి

విశాఖలోని విమ్స్‌ ఆసుపత్రిని ఎయిమ్స్‌ వలే అభివ ద్ధి చేయాలి. విశాఖ మెట్రో రైల్‌ పనులను వెంటనే చేపట్టాలి. విశాఖపట్నం ప్రముఖ పారిశ్రామిక కేంద్రం కూడా కావడంతో ఈ ప్రాంతం మరో భోపాల్‌ కాకుండా పర్యావరణ పరిరక్షణకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్‌ పనులు వెంటనే ప్రారంభించాలి. విశాఖ పోర్ట్‌ కు అనుబంధంగా భావనపాడు, నక్కపల్లిలలో శాటిలైట్‌ పోర్ట్‌ లను నిర్మించాలి. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హౌదాను సత్వరం కల్పించాలి.

పోలవరం ప్రాజెక్ట్‌ ను సత్వరం పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకోవడంతో పాటు నిర్వాసితులకు తగు పరిహారం, పునరావాసం పనులను సత్వరం చేపట్టాలి. విస్తారమైన సహజవనరుల, మౌలిక సౌకర్యాల లభ్యతలో ఉత్తరాంధ్ర ప్రపంచంలోనే అరుదైన ప్రాంతాలలో ఒకటి. నదులు, అడవులు, సముద్ర తీరం, ఖనిజ సంపద, జాతీయ రైలు, రహదారి మార్గాలు, ఓడరేవు, విమానాశ్రయం, అపారమైన మానవ శ్రమశక్తి, అన్నిటికన్నా వనరులు పుష్కరంగా ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర.
ఆంధ్రప్రదేశ్‌ లోని నాలుగు ప్రాంతాలను చూసినా ఈ వనరులన్నీ ఉన్న ఏకైక సంపన్న ప్రాంతం ఉత్తరాంధ్రానే. కానీ ఈ వనరుల్లో ఏ ఒక్కటీ ఉత్తరాంధ్ర అభివ ద్ధికి, ఉత్తరాంధ్ర బిడ్డల మెరుగైన జీవనానికి సంపూర్ణంగా ఉపయోగపడటం లేదు. ఇక్కడి వనరులను ఉపయోగించి ఇక్కడి ప్రజల, ఈ ప్రాంత ప్రజల అభివ ద్ధికి దోహదం చేసే రాజకీయ, ఆర్ధిక, పాలనా విధానాలు లేవు. కనుక ‘మా వనరులను మా అభివ ద్ధికే వెచ్చించాలి’, ‘మా వనరులు కొల్లగొట్టడానికి ఇతరులకు హక్కు లేదు’ అని ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజానీకం తమ ఆకాంక్షను నూతన ప్రభుత్వం ముందు ఎలుగెత్తవలసిన అవసరం వచ్చింది.
ఉత్తరాంధ్ర మనుగడకూ, ఆకాంక్షకూ, నినాదానికి, స్వప్నానికీ ఏమవుతున్నదో, ఎందుకు ధ్వంసమైపోతున్నదో గుర్తించవలసిన చారిత్రక సమయం ఆసన్నమైనది. పురోభివ ద్ధి సాధించవలసిన మన ప్రాంతం, పురోగమనానికి అవసరమైన అన్ని సహజ వనరులు ఉండి కూడా, ఎందుకు నానాటికీ వెనుకబాటుతనంలో మగ్గి పోతున్నదో తెలుసుకోవలసిన చారిత్రక సమయం ఆసన్న మయింది. ఉత్తరాంధ్ర ప్రాంతం పట్ల సాగుతున్న నిర్లక్ష్యం, వనరుల విధ్వంసం, అభివ ద్ధి రాహిత్యం ముప్పేట దాడిని అడ్డుకోవడానికి కనీసం చెయ్యి అడ్డుపెట్టవలసిన బాధ్యత ఉత్తరాంధ్ర బిడ్డలుగా మనందరిదీ. ఆ భాధ్యతను చేపట్టవలసిన అనివార్య తరుణం ఆసన్నమయింది. ఆంధ్రప్రదేశ్‌ అభివ ద్ధి ఫలాలలో మన ప్రాంత ప్రజల న్యాయమైన వాటా కోసం ఎలుగెత్తవలసిన సమయం, నిలదీయవలసిన సమయం ఆసన్నమయింది.
ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, ఈ ప్రాంత ప్రజలు ఏమి కోరుకుంటున్నారో వారి గోడును, ప్రజా ఆకాంక్షలన్నింటినీ సవివరంగా నూతన ప్రభుత్వం ముందుకు తేవడం, ఈ ఆకాంక్షలు నూతన ప్రభుత్వం ఆలకించే విధంగా అన్ని రకాల భావ ప్రచారం, ఉద్యమ నిర్మాణం, సంఘీభావ సమీకరణ ప్రయత్నాలకూ పూనుకోవడం ఈ ప్రాంతపు బిడ్డలు, రాజకీయ నాయకులు, విద్యావంతులు, యువజనులు, విద్యార్థులు, కవులు, కళాకారులు, ఉద్యోగ సంఘాల ప్రతి నిధులు, అన్ని ప్రజా సంఘాల భాద్యత. ఈ కార్యక్రమాలన్నీ చేసినప్పుడే వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివ ద్ధి చెందుతుంది. ఉత్తరాంధ్ర ప్రజలవి గొంతెమ్మ కోర్కెలు కావు. న్యాయబద్ధమైనవి. సహేతుకమైనవి. చట్టబద్ధమైనవి. కాబట్టి వీటిని నూతన ప్రభుత్వం తమ ఎజెండా లో పొందుపరిచి ఉత్తరాంధ్ర ప్రజల పట్ల తమకు గల చిత్తశుద్ధిని, నిజాయతీని ప్రకటించడంలో మొదటి అడుగు వేయాలని కోరుతున్నాము.
(కొణతాల రామకృష్ణ, మాజీ మంత్రి, కన్వీనర్‌,ఉత్తరాంధ్ర చర్చా వేదిక)