కృష్ణా లిఫ్ట్ మీద జగన్ జంకవద్దు, కెసిఆర్ వి బెదిరింపులే: బిజెపి విష్ణు

(విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ రాష్ట్రాఉపాధ్యక్షులు)
 సముద్రంలో కలిసిపోయె నీటిని వాడుకుంటుంటే అడ్డుకోవడం కెసిఆర్ రాజకీయ దిగజారుడుకు నిదర్శనం.
పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ ప్రాంత ప్రజలకు కనీసం సాగునీరు తాగునీరు కాకుండా కుట్రచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు  కృష్ణానది మిగులు జలాలనుంచి నీటిని తరలించేందుకు ఏర్పాటుచేయాలనుకుంటున్నఎత్తి పోతల పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వ్యతిరేకించారు. ఈ ప్రాజక్టును అడ్డుకుంటామని, అవసరమయితే కోర్టు కెళతామని వ్యాఖ్యానించారు.
గోదావరి జలాల విషయంలో కేసీఆర్ మోసపూరిత వైఖరి నేడు స్పష్టంగా బయటపడింది.

https://trendingtelugunews.com/telugu/breaking/kcr-vows-to-stop-andhras-new-life-irrigation-scheme-on-krishna/

రాష్ట్ర ప్రయోజనాలు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు వెళ్ళాల్సందే.
ఆంద్ర ముఖ్యమంత్రి రాయలసీమ ప్రజల తరఫున పోతురెడ్డి పాడు విషయంలో ముందడుగు వేయాలి.
ఈ విషయంలో రాజకీయాలకతీతంగా జగన్మోహన్ రెడ్డి కి అన్ని పార్టీలు సమర్థంచాలని ఇతర పార్టీలకు విజ్నప్తి నిచేస్తున్నాను.
కేసీఆర్ గారు మరోసారి రాయలసీమ ద్రోహిగా మారిపోయారు.
రాయసీమకు అన్యాయం చేయబోతున్న కేసిఅర్ అలోచన తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని బిజెపిగా చెప్పదలుచుకున్నాను
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన కేసీఆర్ గారికి (అనంతపురం జిల్లా ఇన్చార్జి గా ) రాయలసీమలో కరువు గురించి తెలియదా అని అడుగుతున్నా?
కెసిఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల కోసం కాదు రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.