చైనా దగ్గిర యుఎస్ ఎలెక్ట్రానిక్స్ ని మాడ్చేసే సైబర్ వెపన్, యుఎస్ నిపుణుడి హెచ్చరిక

చైనా ఆమెరికాలోకి మొత్తం ఎలెక్ట్రానిక్ వ్యవస్థను స్థంభింపచేయాలనుకుంటున్నాదా? సైనికుల ప్రమేయం లేకుండ మొత్తం అమెరికా లో ఎలెక్ట్రిక్ గ్రిడ్ ని, ఎలెక్ట్రానిక్స్ లో వాడే  సెమికండక్టర్ల ను తీవ్రంగా వేడెక్కించి, కరిగించి పడేసి, మొత్తం వ్యవస్థలను స్థంభింప  చేసేందుకు చైనా పూనుకుంటున్నదా?
అవునంటున్నారు కొంతమంది అమెరికా నిపుణులు.
చైనా అమెరికా మీదకు ఎలెక్ట్రో మ్యాగ్నటిక్ పల్స్ (EMP)ని పంపి అమెరికాలో ఉన్న విద్యుత్ సరఫరా వ్యవస్థను స్థంభింప చేయాలనకుంటున్నదని, అమెరికా వాళ్లు అప్రమత్తంగా ఉండాలని ఒక ఎన్జీవో హెచ్చరించింది.

1941లో జపాన్  అమెరికా హవాయ్ లోని పర్ల్ హార్బర్ మీద హఠాత్తుగా దాడి జరిపినట్లు చైనా ఇపుడు అమెరికా మీద ఇఎం పి దాడి జరుపుతుందని ఈ ఎన్జీవో  విశ్లేషించింది. అంతే, గత రెండు రోజులుగా అమెరికా ఈ చర్చతో కుతకుతలాడుతూ ఉంది.

ఈ ఎన్జీవో పేరు హోమ్ ల్యాండ్ అండ్ నేషనల్ సెక్యూరిటి (Homeland and Nationa Security). ఈ సంస్థకు ఒక EMP Task Force ఉంది. చైనా చేసే ఇఎంపి దాడి నుంచి అమెరికా పవర్ గ్రిడ్ ను పటిష్టం చేసుకునేందుకు ‘ప్రజలను, ఇంజీనర్లను, ఫీల్డ్ ఎక్స్ పర్ట్స్ తదితరులను’ ఏకం చేసేందుకు ఈ టాక్స్ ఫోర్స్ ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  పీటర్ విన్సెంట్ ప్రై (Peter Vincent Pry) చైనా EMP దాడి  చేయాలనుకుంటున్నదని ఒక నివేదిక  జూన్ 10న విడుదల సంచలనం సృష్టించారు.
ఇఎంపి ఆయుధాన్ని ప్రయోగిస్తే, అమెరికా పవర్ గ్రిడ్ మలమలమాడిపోతుందని,అపుడు అమెరికా అంధకారంలో కొట్టు మిట్టాడుతుందని, అది అమెరికా మీద అన్నివైపులనుంచి దాడి చేసేందుకు అవకాశం కల్పిస్తుందని ఆయన ఈ నివేదిక విపులంగా రాశారు. ఒక EMP దాడిజరిగితే, సెల్ ఫోన్లు,ల్యాప్ టాప్ లు, ఇంటర్నెట్, సెమికండక్టర్లు అన్ని మాడిపోతాయి.ఎటిఎంలు పనిచేయవు, రైళ్లు ఎక్కడిక్కడ అగిపోతాయి. ఎలెక్ట్రిక్ వైర్లు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతాయి… ఇలా ఎలెక్రిక్, ఎలెక్ట్రానిక్ వ్యవస్థలు ధ్వంసమవుతాయి. (ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ కథ లాగుంది కదూ).
ఈ సూపర్ ఇఎంపి ఆయుధాన్ని చైనా అమెరికాలోని అణ్వాయుధాల ల్యాబొరేటరీ నుంచే తస్కరించిందని కూడా ఆయన రాశారు.
 లోఈల్డ్ (low-yield) న్యూక్లియార్ వార్ హెడ్స్ నుంచి ఈ ఇఎంపి విడుదలవుతుందని, అది ఆటంబాంబులాగా దేశాన్ని భౌతికంగా ద్వంసం చేయకుండా, ఎలెక్ట్రో మాగ్నటివ్ తరంగాలను గుప్పు గుప్పున విడుదల చేసి అమెరికాను అంధకారంలోకి  నెడుతుందని పీటర్ ఫ్రై చెప్పారు. ఈ ఆయుధాన్ని చైనా సైబర్ ఆయుధంగా పిలుస్తూ ఉంది.
ఒక అణ్వాయుధాన్ని పేల్చినపుడు గుప్పుగుప్పున వెలువడే విద్యుదయస్కాంత శక్తియే ఇఎంపి. పోర్టబుల్ హైవపర్ మైక్రోవేవ్ ఆయుధాలనుంచి కూడా ఈ శక్తిని పుట్టించవచ్చు.ఈ శక్తివంతమయిన పల్స్ లు భూఆయస్కాంత పరిధితో రియాక్టయినపుడు వాటికి భూమ్మీద ఉన్న అన్ని రకాల ఎలెక్రికల్, ఎలెక్ట్రానిక్ కంప్యూటర్లను ధ్వంసం చేసేంత శక్తి వంతంగా తయారవుతాయి.
అంటే కంప్యూటర్లు,సెల్ ఫోన్లు, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, ట్రాన్సిమిషన్ లైన్స్ లత పాటు  అన్ని రకాల  క్రిటికల్ కమ్యూనికేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను నాశనం చేస్తాయి. అమెరికా మీద ఇలాంటి జరిగినపుడు అక్కడి కీలకమయిన సబ్ స్టేషన్లు  నాశమయి వాటి మీద ఆధారపడిన అన్నింటిని నాశనం చేస్తాయి. ఇది అమెరికా సమాచార, విద్యుత్  సైనిక వ్యవస్థలను పనిచేయకుండా చేసే మహాయుధం.
ఇఎంపి అనేది ఎలెక్ట్రానిక్స్ ని ధ్వంసం చేసే ఆయుధం లాంటిది. ఇదెలా పనిచేస్తుందో డేవిడ్ యే (David Yeh) అనే ఇంజనీర్ ల్యాబొరేటరీ లో పరీక్షించి చూపించారు. ఈ ప్రయోగాన్ని  ఆస్టిన్ లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఎలెక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంటులోని కపిల్ గులాటి, డాక్టర్ ఫ్రాన్సిస్ బోస్టిక్ లకు 2006ల  ప్రాజక్టు కోసం చేసి చూపించారాయన.  ఇఎమ్ పికి ఎంత శక్తి ఉందో సూక్ష్మ స్థాయిలో ల్యాబోరేటరీ లో ప్రయోగాత్మకంగా ఆాయన ప్రదర్శించారు.  ఇఎమ్ పి ఆయుధాల గురించి, వాటినుంచి రక్షణ పొందడం గురించి డేవిడ్ యే Electromagnetic Pulse Generator అనే ఈ నివేదికలో చాలా చక్కగా విరించారు.
This EMP generator will be designed to release an electromagnetic pulse. The purpose of the said pulse is to induce a potential, or voltage, that heats up semiconductor material so quickly that it changes the crystal lattice structure of the material and thereby electrically destroying it.
పీటర్ ప్రై రిపోర్టు ప్రకరాం అమెరికా మీద HEMP (High-alititudeEMP) ఆయుధాలను ప్రయోగించేందుకు చైనా మూడు రకాల పద్ధతులను రూపొందించింది. అవి: 1.సాంప్రదాయిక పద్ధతిలో బాలిస్టిక్ మిసైల్స్ ను ప్రయోగించి వార్ హెడ్స్ ను పేల్చి ఇఎంపి తరంగాల సునామీని అమెరికా మీదకు ప్రయోగించడం. 2. హైపర్ సోనికో మిసైల్స్ ను ప్రయోగించడం, ఈ రకం అత్యాధునిక మిసై ల్స్ ని చైనా విజయవంతంగా తయారుచేసింది. 3.మూడో ఫ్యూచరిస్టిక్ , స్పేస్ అధార అటంబాంబుల ద్వారా ఇఎంపిలను విడుదల చేయడం. ఇది శటిలైట్స్ సాయంతో జరిపే దాడి.
ఇవన్నీ వినడానికి అసంభవం అనిపిస్తాయని అయితే,తొందర్లో అవే నిజం కాబోతాయని ప్రై అమెకిన్లను భయపెట్టారు.
Peter Vincent Pry report
EMP దాడిజరిగాక వచ్చే విద్యుత్ షాక్  ఎంతగా నమ్మలేని బీభత్సం  సృష్టిస్తుందో   పీటర్ ప్రై  A Call to Attention For America  పేరు విడదలయిన ఈ నివేదికలో కిందివిధంగా  రాశారు. ఇదంతా ఇఎంపి దాడిజరిగిన మొదటి రోజు వణకు పుట్టించేలా జరిగే అల్లకల్లోలం.
“The power goes out across the entire continental United States. High Voltage Transformers have blown out everywhere. Within minutes, all 58 commercially operating nuclear power plants across the Nation have “scrammed” (i.e. shutdown) their reactors, which is standard operating procedure during the loss of external electric power. Millions of TVs, laptops, and computers have shorted out. Cell phones and landline phones aren’t working. The Internet is down. Smoke is visible from a number of small fires across every community, but very few sirens from fire engines can be heard. Traffic lights are out, and a significant number of cars and trucks that were running are now inoperable and scattered about the roadways. Trains and subways are shutdown. ATM’s don’t work, banks close, and Wall Street closes. The Emergency Broadcasting Service and 911 are not operating. First responders are unable to communicate, coordinate or respond, not that they could get anywhere on the clogged roadways. Many of the planes that were in the air have crashed, and those that didn’t must now attempt to land without help from air traffic control or ground radar. No one seems to know what’s going on. By nightfall, most homes, hospitals, and elderly care facilities are without running water. The nighttime sky is pitch black across America, and the stars seem eerily bright overhead.”
అంతరిక్షంలో తిరుగుతున్న చైనా ఉపగ్రహాలు హై ఇఎంపి ని సృష్టించేందుకు వీలైన అణ్వాయుధాలు మోసు కేళ్తూ ఉంటాయని అయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చైనా దాడి సంగతేమో గాని, ఈ రిపోర్టు అంతరిక్షాన్ని అణ్వాయుద్ధం చేసేందుకు ఆత్రంగాఎదురుచూస్తున్న అమెరికా ప్రభుత్వానికి బాగా అనుకూలిస్తుందని రష్యాకు చెందిన ఆర్ టి.కామ్ (rt.com) వ్యాఖ్యానించింది.
ఎందుకంటే, ఇలాంటి రిపోర్టులను చూపి, తమ ప్రత్యర్థి దేశాలు ఇలా అంతరిక్ష్యాన్ని అణ్వాయుధం చేస్తున్నాయనే నెపంతో అమెరికా అందరికంటే ముందే శటిలైట్ అణ్వాయుధాల ఏర్పాటుకు పూనుకోవచ్చని ఆర్ టి.కామ్ పేర్కొంది.
అంతరిక్షాన్ని అణ్వాయుధం చేసే ప్రయత్నాణలు మానుకోవాలని రష్యా ఎప్పటినుంచో అమెరికాకు సలహా ఇస్తుంఉందని ఈ సైట్ రాసింది.
ఇలాంటి ముప్పు ఎపుడో ఒక సారి వస్తుందని అమెరికా  అనుమానిస్తూనే ఉంది.  అమెరికా ప్రత్యర్థులయిన రష్యా, చైనా లతో పాటు కొత్తగా అమెరికా మీద కాలుదువ్వుతున్న ఉత్తర కొరియా, ఇరాన్ లు ఇలాంటి ఇఎంపి ఆయుధాలకు సానబడుతూ ఉండే అవకాశం ఉందని ఫోర్బ్స్ యూరోప్, రష్యా, యూరేషియా, మిడిల్ ఈస్టు ఎనర్జీ, సెక్యూరిటీ నిపుణుడు ఏరియల్ కోహెన్ (Ariel Cohen ) ఎపుడో 2019 ఏప్రిల్ లోనే రాసింది. ఇలాంటి దాడి అమెరికా క్రిటికల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ మీద జరిగే ప్రమాదం, దానిని తట్టుకునేందకు ఆమెరికా దగ్గిర ఉన్న శక్తి గురించి అంచనా వేయాలని ఆ యేడాది మార్చి 26న ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్దర్ (Executive Order on Coordinting National Resilience to Electromagnetic Pulses” జారీచేశారని కూడా ఫోర్బ్స్ రాసింది.