ఇండియాలో మొదట మద్య నిషేధం అమలైన తెలుగు జిల్లాలేవో తెలుసా?

ఇండియాలో మొట్టమొదట మద్య నిషేధం అమలులోకి వచ్చిన 8 జిల్లాలలో 5 తెలుగు జిల్లాలున్నాయన్న విషయం మీకు తెలుసా?

 

మద్రాసుప్రెసిడెన్సీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం రెండు సభల పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పాటుచేశాక జరిగిన తొలి ఎన్నిక అది.  చక్రవర్తి రాజగోపాలాచాారి (రాజాజీ)  1937 జూలై 14న ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో లేకపోయినా, ఆయన ప్రెసిడెన్సీలో మద్యం తాాగడం,తయారుచేయడం,అమ్మడం నిషేధాంచాలనుకుని 1937 సెప్టెంబర్  ప్రొహిబిషన్ చటం తీసుకువచ్చారు. అక్టోబర్ 1 1937న మొదట ప్రయోగాత్మకంగా తన సొంత జిల్లా సేలం  ప్రవేపెట్టారు. రాజాజీ సొంతవూరు తోరపల్లి నాటి ధర్మపురి తాలూకాలో ఉండింది. మద్రాసు  మద్యనిషేధం చట్టందేశంలోనే మొట్టమొదటి మద్యనిషేధ ప్రయత్నం.
ఆ మరుసటి సంవత్సరం అక్టోబర్ 1 దీనిని కడప చిత్తూరు జిల్లాలకు విస్తరింపచేశారు. 1939 అక్టోబర్ 1 నార్త్ ఆర్కాట్ జిల్లాకు మద్య నిషేధం విస్తరించారు.
మద్యనిషేధం విజయవంతమయితే, మద్రాసు ప్రెసిడెన్సీ భారతదేశానికే కాదు, యావత్రపంచానికి చుక్కాని అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.ఎందుకంటే, మద్యాన్ని నిషేదించేందుకు అమెరికా కూడా ప్రయత్నించివిఫలమయింది. అందుకే అమెరికా చేయలేని మద్రాసు ప్రెసిడెన్సీ చేయాలని ఆయన కలగన్నారు.
రాజాజీ
సేలం, కడప, చిత్తూరు, నార్త్ ఆర్కాట్ జిల్లాలలో మద్య నిషేధం విదేశీ మద్యం తాగాలనుకునేవారికి పర్మిట్లు ఇచ్చే విధానం ప్రవేశపెట్టారు. అంతేకాకుండా, తెల్లవాళ్లను మద్య నిషేధం పరిధి నుంచి తప్పించారు.
అయితే, మద్య నిషేధానికి బాగా వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతల నుంచే. దానికితోడు కడప చిత్తూరు  జిల్లాలో నాటుసారా కాచడం విపరీతమయింది. మద్య నిషేధాన్ని ఎక్కువ మంది హర్షించినా, అక్రమంగా సారా తయారుచేయడం, కల్లు గీయడం,అమ్మడం తీవ్రమయింది.దానికి తోడు ఎక్సయిజ్ నుంచి పడిపోయిన రాబడిని పూడ్చేందుకు  సేల్స్ టాక్స్ పెంచాల్స వచ్చింది.   1940 అప్పటి ఎక్సయిజ్ కమిషనర్ ఆస్టిన్ కడప, చిత్తూరు జిల్లాలో పర్యటించి ఒక నివేదిక సమర్పించారు.దీని ప్రకారం, జమ్మలమడుగు, పులివెందుల,బద్వేల్, ప్రొద్దుటూరులలో నాటు సారా కాచడం ,అమ్మడం విపరీతంగా పెరిగింది. అధికారికంగా నార్త్ ఆర్కాట్ లో మద్య నిషేధం అమలు విజయవంతమని  ప్రకటించినా, చిత్తూరు తయారుయిననాటు సారా నార్త్ అర్కాట్ కు, కర్నాటకలోకి కోలార్ గోల్డ్ ఫీల్డ్ ప్రాంతానికి తరలిపోయేది. అయినా సరే రాజాజీ ప్రభుత్వం మద్యనిషేధాన్ని అమలుచేసేందుకే పూనుకుంది. అయితే, రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం పాల్గొనడానికి నిరసన తెలుపుతూ 1939 అక్టోబర్ నెలాఖరు రాజాజీ ప్రభుత్వం రాజీనామా చేసింది. మళ్లీ ఎలెక్షన్ 1946 దాకా జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయాక మద్య నిషేధం గురించి పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు.
దీనితో 1943 నవంబర్ లో మద్రాసు ప్రభుత్వం 1937 మద్య నిషేధ చట్టాన్ని రద్దు చేస్తూ కొత్త చట్టం తీసుకువచ్చింది. దీనితో 1945 అక్టోబర్ 1 నుంచి సారాదుకాణాలు మళ్లీ తెరుచుకున్నాయి.మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ప్రొహిబిషన్ మాయమయింది.
1946  మార్చిలో జరిగిన జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది.
టంగుటూరి ప్రకాశం పంతులు
ప్రెసిడెన్సీలో  215స్థానాలలో కాంగ్రెస్ కు 162 స్థానాలు వచ్చాయి.కౌన్సిల్ లోని  54  స్థానాలలో 27 గెల్చుకుంది. ఏప్రిల్ టంగుటూరి ప్రకాశం పంతులు ‘ప్రధాన మంత్రి’ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.  అపుడు ఎక్సైజ్ మంత్రి తెలుగు వాడే. కడప కోటిరెడ్డి.  మద్యనిషేధం చర్చ మొదలయింది. నిషేధం విధించాలా వద్దా అని ప్రతిచోట అడగడం మొదలుపెట్టారు. గుంటూరులో మాట్లడుతూ మద్య నిషేధం తప్పక ఉంటుందని, ప్రెశిడెన్సీలోని అన్ని జిల్లాల్లో విధించడం సాధ్యం కాదని కోటిరెడ్డి చెప్పారు. రాజాజీ మద్యనిషేధం ప్రెశిడెన్సీ మొత్తం విధించాలని వత్తిడి తెస్తున్నారు.
ఈ వత్తిడికి కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేకపోయింది.చివరకు అసెంబ్లీ లో ప్రధాని ప్రకాశం పంతులు మద్య నిషేదం విధిస్తున్నట్లు ప్రకటన చేయాల్సి వచ్చింది. అయితే, రాజాజీ మద్యనిషేధం విధించిన నాలుగు జిల్లాలలో మాత్రం అమలుచేస్తామని ఆయన ప్రకటించారు. అంటే, సేలం,నార్త్ ఆర్కాట్, కడప, చిత్తూరుజిల్లాలన్నమాట. కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రమంతా విధించాలని పట్టుబట్టింది. ప్రకాశం పంతులు మాత్రం పాక్షికంగానే మొదట విధిస్తామని చెప్పాయి. అయితే, ఈ నాలుగు జిల్లాల్లో కఠినంగా మద్యనిషేధం అమలుచేయాంటే ఇతర ప్రాంతాలనుంచి వీటికి అక్రమంగా సారా రాకుండా అడ్డుకోవాలి.  ఈ నాలుగు జిల్లాలచుట్టూర చాలా సంస్థానాలున్నాయి. వాటితో స్మగ్లింగ్ నివారణ ఒప్పందాలుచేసుకోవాలని భావించాయి. మద్య నిషేధం నాలుగు జిలాలకు పరిమితం చేయకుండా ప్రెశిడెన్సీ మొత్తం అమలుచేయాలని 196 మంది కాంగ్రెస్ శాసన సభ్యులు ప్రధాని ప్రకాశానికి విజ్ఞాపన పత్రం సమర్పించారు.
ఇలా అన్ని వైపు లనుంచి వత్తిడి రావడంతో మరొక నాలుగు జిల్లాలకు మద్యనిషేధం చట్టం వర్తింప చేస్తామని ప్రకాశం పంతులు ప్రకటించారు. ఇందులో కూడా మూడు తెలుగు జిల్లాలు న్నాయి. నాలుగు జిల్లాలు: కొయంబత్తూరు, బళ్లారి, అనంతపురం,కర్నూలు. వీటిలో 1946 అక్టోబర్ 1 నుంచి మద్య నిషేధం అమలులోకి వస్తుందని ప్రకాశం పంతులు అసెంబ్లీ లో ప్రకటించారు. మద్య నిషేధం ఈ నాలుగు జిల్లాల్లో అమలు చేస్తే  227.84 లక్షల రుపాయల రెవిన్యూ పడిపోతుందని   ప్రభుత్వం చెప్పింది. మొదటి నాలుగు జిల్లాలనుమచి రు. 230 లక్షల ఆదాయం పడిపోయింది. అందువల్ల ప్రెశిడెన్సీ మొత్తం అమలుచేయడం సాధ్యంకాదనేది ప్రకాశం పతుల వాదన. మూడేళ్లలో మొత్తం ప్రశిడెన్సీకి విస్తరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇలా  1946 అక్టోబర్ 1 నుంచి మద్రాస్ ప్రెశిడెన్సీలోని 8 జిల్లాల్లో మద్య నిషేదం రెండో సారి అమలులోకి వచ్చింది. ఇందులో  5 జిల్లాలు తెలుగు ప్రాంతాలవే.

(తర్వాాత 1947 అక్టోబర్లో మరొక 8 జిల్లాకు ప్రొహిబిషన్ విస్తరించారు. కొన్నిశక్తులు అక్రమ సారా జోరుగా సాగిందని హైలైట్ చేసినా, ఈ ప్రొహిబిషన్ వల్ల చాలా కుటుంబాలు బాగుపడ్దాయని చాలా మంది పరిశోధనల్లో తేలింది.  అయితే, ఎంతో కాలం సాగలేదు. పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది స్వాతంత్య్రం వచ్చాక.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *