ఈ నెల 10 నుంచి బెజవాడ దుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న దర్శనాలు

ఇంద్ర‌కీలాద్రి:  కోవిడ్ లాక్ డౌన్ నియమాలను సడలిస్తున్న ఆలయాలను తెరిచేందుకు కేంద్రం అనుమతి నీయడంతో ఈ నెల 10వ తేదీన‌ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారుు.

ఈ విషయాన్ని ఈ సాయంకాలం  శ్రీదుర్గ‌మ‌ల్లేశ్వ‌ర స్వామి వార్ల దేవస్థానం  ఈవో సురేష్‌బాబు తెలిపారు.

దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్‌ సోమినాయుడితో కలసి  ఈవో సురేష్‌బాబు ఆదివారం విలేకరుల స‌మావేశంలో మాట్లాడారు.

రూ.300 టికెట్లు రద్దు చేశామని, తీర్థాలు, శఠగోపాలు ఉండవని వారు తెలిపారు.  ప్రసాదాలు నేరుగా ప్యాకెట్ల రూపంలో భక్తులకు ఇస్తామని  సోమ‌, మంగ‌ళ‌వారాల్లో దర్శనాల ట్రయల్‌ రన్‌ ఉంటుందని వారుపేర్కొన్నారు.

మహామండపం ద్వారానే భక్తులు అమ్మవారిని  దర్శనం చేసుకుని కిందకు రావాలని సూచించారు. భక్తులు కరోనా సూచనలు పాటిస్తూ ఆలయ అధికారులు, సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

పదో తేదీనుంచి శ్రీశైలంలో దర్శనాలు
Srisailam temple (Credits Srisailam Temple)
ఆంధ్రప్రదేశ్ లో ని మరొక పుణ్యక్షేత్రం శ్రీశైలం కూడా దర్శనాలకు భక్తులను అనుమిస్తున్నది. సోమవారం నుంచి ఆలయం భక్తులకు స్వాగతం పలింకేందుకు సిద్ధమవుతూ ఉందని ఆలయం ఇవొ కెఎస్ రామారావు ప్రకటించారు. ఇక్కడ కూడా ట్రయల్ దర్శనాలతో ఈ కార్యక్రమం మొదలవుతున్నది ఇక్కడ మొదట దేవస్థానం ఉద్యోగులు, శ్రీశైలం వాసులతో ట్రయల్ రన్ మొదలవుతుంది.
పదో తేదీనుంచి రెగ్యులర్ దర్శనాలు మొదలవుతున్నాయి. అయితే, భక్తులు దర్శనాలుకు మొదట ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాలి. ఇది దూరదర్శనమని, రోజూ మూడు వేల మందికి దర్శనం కల్పిస్తామని ఇవొ చెప్పారు.
మార్చి 22న శ్రీశైలంలో ఆర్జిత్ సేవల కరోనా కారణంగా బంద్ అయ్యాయి. ఇపుడు రెన్నెళ్ల తర్వాత శ్రీశైల శైల క్షేత్రం భక్తులకోసం మళ్లీ తెరుచుకుంటున్నది.