శ్రీవారి బూందీ పోటు అగ్ని ప్రమాదం పై టీటీడీ వివరణ

 తిరుమల లో  డిసెంబరు 08న బూందీ పోటులో  జరిగింది స్వల్ప అగ్నిప్రమాదమేనని
శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈఓ  హరీంద్రనాథ్ వివరణ ఇచ్చారు.
శ్రీవారి ఆలయం వెలుపల గల అదనపు బూందీ పోటులో జరిగిన ఈ అగ్నిప్రమాదములో జరగలేదని శ్రీవారి హరీంద్రనాథ్ తెలిపారు.
బూందీ తయారీ క్రమంలో పోటు కార్మికుడు బాణలిలో నెయ్యి నింపుతుండగా పొరపాటున నెయ్యి డబ్బా జారి పొయ్యి పై పడడంతో మంటలు అంటుకున్నాయి.
స్వల్పంగా చెలరేగిన మంటలు బ్లోయర్ ద్వారా బయటకు వ్యాపించాయి. దట్టమైన పొగ వెలువడింది. అక్కడున్న సాంకేతిక సిబ్బంది సత్వరం స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీనివల్ల ఎవరికీ ఎలాంటి అపాయం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదు.
ఈ కారణంగా పోటును శుభ్రం చేయాల్సి రావడం వల్ల 20 పొయ్యిలను తయారీకి దూరంగా ఉంచడం జరిగింది. అరగంటలో పోటును శుభ్రం చేసి బూందీ తయారీ ప్రక్రియను యధావిధిగా కొనసాగించడం జరుగుతోందని తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.