ఆంధ్రలో ఈ స్టేషన్లలో నేటి నుంచి రైళ్లాగవు, రిజర్వేషన్లు రద్దు

కేంద్ర ప్రభుత్వము జూన్ 1 నుండి 200 ప్యాసింజర్ రైళ్లను దేశవ్యాప్తంగా నడపటం మొదలుపెట్టింది. అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో 22 ట్రైన్లు నడుస్తున్నాయి. కొన్ని COVID ప్రోటోకాల్ మూలంగా ఏపీ లోని నడిచే రైళ్లు కొన్ని సేష్టన్ల వద్ద ఆపరాదని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ చేసిన ఈ విజ్ఞప్తిని రైల్వే ఆమోదించింది. అందువల్ల  ఈ క్రింది స్టేషన్లలో ఆగవు. అందరూ గమనించగలరు
జూన్ 4 నుంచి ఈనిర్ణయం అమల్లోకి వస్తుంది. రద్దు చేసిన స్టేషన్లలో రైలు ఎక్కడానికి, దిగడానికి టికెట్లను అడ్వాన్సుగా బుక్‌ చేసుకున్న వారికి చార్జీలను పూర్తిస్థాయిలో తిరిగి చెల్లించనున్నారు.
ఆగని స్టేషన్ల వివరాలు….
1.సికింద్రాబాద్‌-హౌరా(ఫలక్‌నుమా): పిడుగురాళ్ల, తాడేపల్లిగూడెం, సామర్లకోట, పలాస, ఇచ్ఛాపురం స్టేషన్లలో ఆగదు.
2.సికింద్రాబాద్‌-గుంటూరు(గోల్కొండ): కొండపల్లి, రాయనపాడు, కృష్ణాకెనాల్‌, మంగళగిరి, నంబూరు, పెదకాకానిలో ఆగదు.
3. హైదరాబాద్‌-విశాఖ(గోదావరి): తాడేపల్లిగూడెం, నిడదవోలు, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం, ఎలమంచిలి, దువ్వాడ స్టేషన్లలో ఆగదు.
4.తిరుపతి-నిజామాబాద్‌(రాయలసీమ): రేణిగుంట, కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, రాజంపేట, నందలూరు, కమలాపురం, యర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం, తాడిపత్రి, గూటి స్టేషన్లలో ఆగదు.
5.ముంబై-భువనేశ్వర్‌(కోణార్క్‌): తాడేపల్లిగూడెం, నిడదవోలు, సామర్లకోట, పిఠాపురం, తుని, అనకాపల్లి, పలాస, సోంపేట, ఇచ్ఛాపురంలో ఆగదు.
6.ముంబై-బెంగళూరు(ఉద్యాన్‌): ఆదోని, గూటి, ధర్మవరం, ప్రశాంతి నిలయం, పెనుకొండ, హిందూపురంలో ఆగదు.
7.దానాపూర్‌-బెంగళూరు(సంఘమిత్ర): గూడూరులో ఆగదు. బెంగళూరు-దానాపూర్‌(సంఘమిత్ర): రేణిగుంట, గూడూరులలో ఆగదు.
8.విశాఖపట్నం-న్యూఢిల్లీ(ఏపీఎక్స్‌ప్రెస్‌): రాజమండ్రి, ఏలూరు, బెజవాడలో ఆగుతుంది.
8.యశ్వంత్‌పూర్‌-హౌరా
(దురంతో): విజయవాడ, రేణిగుంటలో ఆగుతుంది. విజయనగరంలో ఆగదు.
9.బెంగళూరు-నిజాముద్దీన్‌(రాజధాని): గుంతకల్‌, అనంతపురం స్టేషన్లలో ఆగుతుంది.
10. నిజాముద్దీన్‌-చెన్నై(బై వీక్లీ): విజయవాడలో ఆగుతుంది.