అగ్గిపెట్టె గుర్తుతో పోటీ చేయనున్నతెలంగాణ జనసమితి

అగ్గిపెట్టే గుర్తు తో మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జనసమితి  నిర్ణయిచింది. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ వెల్లడించారు. 23 అంశాలతో కూడిన మునిసిపల్ ఎన్నికల ప్రణాలికను టి జె ఎస్ కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. మునిసిపల్ ఎన్నికల ప్రజా సమస్య లే జన సమితి ప్రధాన ఎజెండా అని మునిసిపాలిటీ నిర్లక్ష్యానికి గురయ్యాయి. వాటిని తిరిగి పునరుద్దా రించాల్సిన అవసరం ఉందని అయన అన్నారు.
‘మునిసిపాలిటీల అభివృద్ధి పై ప్రధాన అంశంగా చర్చ జరగాల్సి అవసరం ఉంది. మునిసిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడుగుతున్న రాజకీయ పార్టీలు రాబోయే ఐదు ఐదేళ్ల లో ఎం చేస్తారో చెప్పాలి. అక్రమలపై కలసి వచ్చే అందరితో హైదరాబాద్ వేదికగా మహా సభ పెట్టాలని భావిస్తున్నాం.- జవాబుదారీతనం తో కూడిన పాలన మునిసిపాలిటీలల్లో జరగడం లేదు.’ అని ఆయన అన్నారు.