కరోనాతో తెనాలి ప్రభుత్వాసుపత్రి వైద్యుడు మృతి

 గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ వైద్యశాల ఆర్ఎంవో డాక్టర్ శామ్యూల్ ప్రేమ్ కుమార్ కరోనాతో మృతి చెందారు. కరోనామీద జరుగుతున్న పోరాటంలో ముందుండి ప్రజలకు అండగా నిలబడిన ఒక డాక్టర్ చనిపోవడం విషాదం.
 తెనాలి జిల్లా వైద్యశాల సూపరిండెంట్ సనత్ కుమారి డాక్టర్ ప్రేమ్ మరణ వార్త ప్రకటించారు. ఆయన కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో మొదట గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
పాజిటివ్ అయినప్పటికీ  ఆయనకు ఎలాంటి రోగ లక్షణాలుకనిపించలేదు.ఇది హఠాత్పరిణమమనిచెబుతున్నారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందారు.

ఆయన 1985వ బ్యాచ్ కు చెందిన గుంటూరు వైద్యకళాశాల పూర్వ విద్యార్థి. డాక్టర్ గా ఆయనకు ప్రజలలో మంచిపేరుందని, ఆయన మృతి దిగ్భ్రాంతి కలిగించిందని  ప్రేమ్ కుమార్ స్నేహితులుచెప్పారు. ఆయన ఎసింప్టొమాటిక్ అని, అయితే  ఉన్నట్లుండి పరిస్థితి విషమించి విషాదం జరిగిందని వారు చెప్పారు.