తెలంగాణ లో రికార్డ్ స్థాయి లో 253 కరోన పాజిటివ్ కేసులు నమోదు..

ఈ రోజు తెలంగాణ లో రికార్డ్ స్థాయి లో 253 కరోన పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.దీనితో  రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్క 4737 కి చేరింది.
ఇవాళ మరో 8 మంది మృతి చెందడంతో  మొత్తం కోవిడ్-19 మరణాలు 182 కి చేరాయి. ఇప్పటి వరకు  చికిత్స చేయించుకుని ఆసుపత్రి నుంచి విడుదయిన వారు 2352 మంది. యాక్టివ్ కేసులు 2203. ఈ రోజు నమోదయిన కేసులో  178 కేసులు ఒక్క జిహెచ్ ఎంసి నుంచే వచ్చాయి.
మొత్తంగా 18 జిల్లాలనుంచి ఈ రోజు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో సంగారెడ్డి తనుంచి 24, మేడ్చల్ నుంచి 14, రంగారెడ్డి జిల్లా నుంచి 11, మహబూబ్ నగర్ నుంచి 4, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కరీంనగర్, నల్గొండ, ములుగురు, సిర్సిల్ల, మంచిర్యాల్ ల నుంచి రెండేసి కేసులు నమోదయితే, సిద్దిపేట, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, కామారెడ్డి, జగిత్యాల్ లనుంచి ఒకటేసి చొప్పున కేసులు నమోదయ్యాయి.