తెలంగాణలో ఈ రోజు 879 కొత్త కేసులు, ముగ్గురు మృతి

తెలంగాణ రాష్ట్రం అడ్డుఅదుపులేకుండా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ రోజు  879 కొరొనా పాజిటివ్ కేసులు నమోదయిన నట్లు ఆరోగ్య శాఖ బులెటీన్ విడుదల చేసింది. మరణాలకు సంబంధించి  ఈ రోజు  3 మరణాలు  సంభవించాయి. దీనితో మొత్తం మరణాలు 220 కి చేరుకున్నాయి.  పాజిటివ్ కేసుల వివరాల్లోకి  GHMC పరిధిలో 652 కేసులు నమోదయ్యాయి.  రెండో స్థానంలోకి మేడ్చెల్ చేరింది. ఇక్కడ 112 కేసులు కనిపించాయి. రంగారెడ్డి నుంచి 64,  వరంగల్ రూరల్ నుంచి 14, కామారెడ్డి  నుంచి పది కేసులు నమోదయ్యాయి.