జిహెచ్ ఎంసిలో 44 కరోనా కొత్త కేసులు నమోదు

శనివారం నాడు తెలంగాణ రాష్ట్రంలో 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో నమోదయిన కేసులు 1509 కు చేరుకున్నాయి.ఇప్పటి వరకు 971 మంది డిశ్చార్జ్ అయ్యారని, దీనితో యాక్టివ్ కేసులు కేవలం 504 మాత్రమే నని  తెలంగాణా ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసింది.
ఇవాళ చికిత్స తీసుకుని మెరుగుపడిన  12 మంది డిశ్చార్జ్ చేశారు. ఇంతవరకు రాష్ట్రంలో మొత్తం 34 మంది మృతి చెందారు.  ఈ రోజు నమోదయిన కేసులలో  ఒక్క జిహెచ్ఎంసీ నుంచే 44 కేసులొచ్చాయి. మిగతవారిలో  8పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళున్నారు. మిగతా రెండింటిలో ఒకటి  రంగారెడ్డి జిల్లా నుంచి, మరొకటి
సంగారెడ్డి జిల్లా నుంచి వచ్చింది. ఇది మినహా తెలంగాణ మొత్తం కరోనాలేని రాష్ట్రమే.