19న తెలంగాణ కాంగ్రెస్ ‘రాజ్ భవన్ ఘెరావ్’

గత యాభై రోజులకు పైగా ఢిల్లీ సమీపాన సాగుతున్న రైతంగా పోరాటాలకు మద్దతుగా హైదరాబాద్ రాజ్ భవన్ ఘెరావ్ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

జనవరి 19న ఘెరావ్ కార్యక్రమం ఉంటుందని దానిని విజయవంతం చేయాలని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఇదే విధంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను కూడా ఉపసంహరించుకోవాలని కూడా కాంగ్రెస్ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నది.

జనవరి 19న ఉదయం 11 గంటలకు కార్యకర్తలు,  నేతలు సెక్రెటేరియట్ సమీపంలోని లుంబీని పార్క్ దగ్గిర సమావేశమయి, రాజ్ భవన్ వైపు వెళతారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *