చెన్నైలో తీవ్రంగా కరోనా, నేటి కొత్త కేసులు 1155, మరణాలు 18

తమిళనాడు కరోనా వైరస్ విజృంభిస్తున్నది. అదివారం నాడు 1515 కేసులు నమోదయ్యాయి, ఈ మధ్య తమిళనాడులో ఎపుడూ రోజుకు వేయి కేసులు తగ్గకుండా వస్తున్నాయి.
ఆదివారం నాడు చెన్నైలోనే 1155 కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తున్నది. దీనిని బట్టి ఇక్కడి కరోనా కర్వు ఇప్పట్లో చదును అయ్యే అవకాశం కనిపించడం లేదు.
తిరువళ్లూరు, చెంగల్పట్లు వంటి జిల్లాలలో మినహా రాష్ట్రమంతా పాజిటివ్ కేసులో తక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారంనాడు తిరువళ్లూరులో 55 కేసులు, చెంగల్పట్లు 135 కేసులు నమోదయ్యాయి.
తమిళనాడు మొత్తం పాజిటివ్ కేసులు 16,999 కాగా డిశ్చార్జ అయిన వారు కేవలం 604 మాత్రమే. ఆదివారంనాడు 18 మంది మృతిచెందారు. దీనితో మృతుల సంఖ్య 269 కి చేరింది.