హిందీ కన్నడ భాషల్లో తిరుపతి వెంకన్న ప్రసారాలు

హిందీ, కన్నడ భాషల్లో కూడా  ఎస్వీబీసీ ద్వారా తిరుమల తిరుపతి వెంకన్న ప ప్రాసారాలు చేయాలని నిర్ణయించారు. ఇదే విధంగా
ఎస్వీబీసీని యాడ్‌ ఫ్రీ ఛానల్‌గా మారుస్తామని  తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
దాతల విరాళలతోనే ఎస్వీబీసీ ఛానల్‌ను నడుపుతామని చెబుతూ త్వరలోనే ఆన్‌లైన్‌లో కల్యాణోత్సవ సేవను నిర్వహిస్తామని కూడా సుబ్బారెడ్డి వెల్లడించారు.
శ్రీవారి ఆలయంలో కరోనా బారిన పడిన అర్చకులందరూ కోలుకున్నారని ప్రస్తుత పరిస్థితులలో దైవదర్శనాలకు  భక్తుల సంఖ్య ను  పెంచే ఆలోచన లేదని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
నిన్న శ్రీవారి దర్శనాలు
జూలై 30వ తేదీన 5,549 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీకి రు. 35 లక్షలువసూలయ్యాయి. తలనీలాలు సమర్పించిన వారు 1669 మంది. ఇందులో మహిళలు 53 కాగా, పురుషుడు 1616 మంది.