రమేష్ కుమార్ ఆఫీస్ కు ఎలా వస్తారు? ఎపి ప్రభుత్వం అభ్యంతరం

ఆంధ్ర హైకోర్టు తీర్పు ఇచ్చిందో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం  వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరామ్ వెల్లడించారు. ఆయనను పునర్నియమించినట్లు కోర్టు తీర్పులో ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన చెప్పారు. రాష్ట్ర ఎన్నిలక కమిషన్ చీఫ్ తిరిగి వచ్చినట్లు తనకు తానుగా ఎలా ప్రకటించుకుంటారని శ్రీరామ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాడే పల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
హైకోర్టు నిన్న ఇచ్చిన తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం కూడా చట్ట విరుద్ధమని అన్నారు.  సాధారణంగా ప్రభుత్వ న్యాయనిపుణులు ఎప్పుడూ మీడియా ముందుకు రారు అయినా కానీ ఇది రాజ్యాంగ అంశాలకు చెందిన హైకోర్టు తీర్పు కాబట్టి తాను మీడియా ముందుకు రావాల్సివచ్చిందని ఆయన చెప్పారు.

ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కామెంట్స్
నిన్న మధ్యాహ్నం 3.30 గంటలకు హైకోర్టు జడ్జిమెంట్ కాపీ వచ్చింది
నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర, జిల్లా అధికారులకు ఒక సర్కులర్ జారీ చేశారు
రాష్ట్ర ఎన్నికల అధికారిగా తిరిగి బాధ్యతలు చేపట్టినట్లుగా నిమ్మగడ్డ రమేష్ కుమారే ప్రకటించుకున్నారు
విజయవాడ కార్యాలయం నుంచి సర్క్యూలర్ విడుదల చేసి  హైదరాబాద్‌లోని తన ఇంటికి వాహనాలు పంపించాలన్నారు
ఎస్ఈసీగా కొనసాగమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టు నేరుగా ఎక్కడా చెప్పలేదు
నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం తనంతట తానే బాధ్యతలు స్వీకరించినట్లుగా సర్క్యూలర్ విడుదల చేశారు
సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ వేశాం..
అప్పటివరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కూడా కోరాం
రాష్ట్ర ఎన్నికల అధికారిని నియమించే అధికారం రాష్ట్రానికి లేదు అంటే.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా ఈ నిబంధనే వర్తిస్తుంది
అలాంటప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రభుత్వం ఎలా నియమిస్తుంది?
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కూడా అప్పటి సీఎం చంద్రబాబు సలహా మేరకే నియమించారు

Like this story? Share it to a friend

గవర్నర్ నిర్ణయంలో మంత్రి మండలి సలహా అవసరం లేదంటే.. అప్పటి సీఎం చంద్రబాబు ఇచ్చిన సలహా కూడా చెల్లదు
నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం కూడా చెల్లదు
హైకోర్టు తీర్పులో కాలవ్యవధి స్పష్టంగా చెప్పకుంటే.. రెండు నెలల కాలవ్యవధి ఉంటుంది
హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వీయ నియామకం చేసుకునే అధికారం లేదు
ఎస్ఈసీ స్టాండింగ్ కౌన్సిల్ గా ఉన్న ప్రభాకర్ ను రేపటిలోగా రాజీనామా చేయమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు
ఈ విషయం ప్రభాకర్ నాకు ఫోన్ చేసి చెప్పారు
నాకు కొంత సమయం కావాలని ప్రభాకర్ నిమ్మగడ్డను కోరారు
నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం రేపటిలోగా రాజీనామా చేయమని ఆదేశించారు
ఇప్పటికే స్టే ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది
ఎస్ఈసీ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం
హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం కూడా చట్ట విరుద్ధం
హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వీయ నియామకం చేసుకునే అధికారం లేదు
సాధారణంగా ప్రభుత్వ న్యాయనిపుణులు ఎప్పుడూ మీడియా ముందుకు రారు..
కానీ ఇది రాజ్యాంగ అంశాలు హైకోర్టు తీర్పుతో కూడినందున మీడియా ముందుకు రావాల్సివచ్చింది