తెలంగాణలో ఇవాళ కరోనాతో 6 గురు మృతి

తెలంగాణ లో కరోనావైరస్ సోకి రోజు ఆరుగురు మృతి చెందారు. మొత్తంగా ఈ రోజు 74 కొత్త పాజిటివ్ కేసులు కనిపించాయి.  ఇందులో తెలంగాణ నుంచి 60 కేసులుంటేమిగతావి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వారివని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా పరిస్తితి మీద ఆరోగ్య శాఖ ఒక బులెటీన్ విడుదల చేసింది.
 ఈ రోజు ఆరు మందితో కలిపి రాష్ట్రంలో ఇంతవరకు 77 మంది కోెవిడ్ -19 వల్ల మరణించారు.   ఈ రోజు చనిపోయిన వారిలో ఇద్దరు శిశువులున్నారు. ఇందులో ఒకరి వయసు మూడునెలలయితే, మరొకరు  24 రోజుల నవజాత శిశువు.
ఈ రోజు వచ్చిన కేసులలలో ఎక్కువ భాగం గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం నుంచే వున్నాయి.బులెటీన ప్రకారం జిఎహెచ్ ఎంసి ఏరియా నుంచి 41 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2499 కి పెరిగింది. ఇందులో లోకల్ కేసులు2068.
ఇంతవరకురాష్ట్రంలో చికిత్స తీసుకుని విడుదలయిన వారి సంఖ్య 1412. రాష్ట్రంలో ప్రస్తుతం ఆసుపత్రులలో ఉన్న యాక్టివ్ కరోనా రోగులు 1010.