మహాకాళ్ ఎక్స్ ప్రెస్ లో కోచ్ బి-5, సీట్ నెంబర్ 64 ఎవరిదో తెలుసా?

రైళ్లలో కొత్త సంప్రదాయం మొదలు పెట్టారు.ఆంధ్రప్రదేశ్ ఆర్టీసిలో ఎమ్మెల్యేలకు, ఎంపిలకు పర్మనెంటుగా సీట్ నెంబర్ రిజర్వు చేసినట్లు రైళ్లలోఇంతవరకు శాశ్వతంగా ఎవరికీ సీట్లు కేటాయించలేదు. ఇపుడు తొలిసారి గా ఇది జరిగింది. నిన్న  ప్రారంభమయిన ఐర్ సిటిసి మహాకాల్ ఎక్స్ ప్రెస్ లో  ఒక సీటును శివుడికి  రిజర్వు చేసి పెట్టింది. దీనితో వివాదం మొదలయింది.
ఎఐఎంఐఎం నేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ వొవైసీ దీని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు రైల్వేవారి ఏర్పాటు మీద స్పందిస్తూ ఆయన ఒక ట్వీట్ చేస్తూ రాజ్యాంగాన్ని గుర్తు చేశారు.

ఈ రైలును నిన్న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. రెండు రాష్ట్రాలల్లోని మూడు జ్యోతిర్లింగాలను కలుపుతూఈ రైలును రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్ సిటిసి నడుపుతుంది. ఈ సంస్థ నడుపుతున్న రైళ్లలో ఇది మూడవది. ఇందులో బి-5 కోచ్ లో సీట్ నెంబర్ 64ను  శివుడికి రిజర్వు చేశారు. భారత రైల్వే చరిత్రలో ఇలా దేవుడికి ఒక సీటును రిజర్వు చేయడం అనేది ఎపుడూ జరగలేదు. ఇదే మొదటి సారి.

Take a look at the newly inaugurated Kashi Mahakal Express, with its clean & hygienic pantry for providing high quality vegetarian food to passengers.

Also, facilities such as bedrolls, houskeeping and travel insurance is going to make the journey convenient & pleasant for all. pic.twitter.com/KbTkxSQ8rK

— Piyush Goyal (@PiyushGoyal) February 16, 2020

ఈ రైలు ఓంకారేశ్వర్, (ఇండోర్ ), మహాకాళేశ్వర్ (ఉజ్జయిని). కాశీవిశ్వనాథ్ క్షేత్రాలను కలుపుతూ నడుస్తుంది.
రైలులోని సీటుని ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి  రిజర్వు చేశారని చెప్పేందుకు సీటు మీద గుడి బోమ్మ కూడా చిత్రీకరించి సీటును చిన్న గుడిగా మారుస్తారు. అయితే, ఈ ఏర్పాటు శాశ్వతంగా ఉండాలనేదానిమీద ఐఆర్ సిటిసి తొందర్లో నిర్ణయం తీసుకుంటుంది.
ఈ రైలు ప్రతికోచ్ లో భక్తి సంగీతం వినిపిస్తూఉంటారు. ప్రతికోచ్ ఇద్దరు గార్డులుంటారు. శాకాహార భోజనం మాత్రమే అందిస్తారు.