రైళ్ల మీద వాణిజ్య ప్రకటనలు, రాబడికి కొత్త మార్గం

చాలా రోజుల తర్వాత రైల్వే శాఖకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. రాబడి పెందచునేందుకు రైలు బోగీలను వినియోగించుకోవాలనుకుంటున్నది. రైలు ఇంజిన్ మొదలుకుని బోగుల దాకా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ   వాణిజ్య ప్రకటనలను అనుమతించి నాన్ ఫేర్ (non-fare) రాబడి  పెంచుకోవాలనుకుంటున్నది.
ఈ విషయాన్ని రైల్వేమంత్రీ పీయూష్ గోయల్ ట్విట్టర్ ప్రకటించారు. వాణిజ్య ప్రకటనలున్న లోకోమోటివ్ ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు. నిజానికి ఈ పని ఎపుడో చేయావలసి ఉండింది. రైల్వేలు కష్టాల్లో ఉన్నపుడు గతంలో ఒక్క రైల్వే మంత్రికి కూడా ఈ ఆలోచన రాలేదు.ఆశ్చర్యం.
2017లో ఇలాంటి వార్తలొకసారి వచ్చాయి. అపుడు సౌత్ ఈస్టర్న్ రైల్వే ఈ ప్రయత్నం చేసిందని, అపుడు గూడ్సుల మీద ప్రకటనలు వేసేందుకు దాల్మియా సిమెంట్ కాంట్రాక్ట్ తీసుకుందని మీడియాలో వార్తలొచ్చాయి. తర్వాత ఈ విధానం విస్తరించలేదు.
నాన్ ఫేర్ రెవిన్యూ పెంచుకునే ఆలోచనల సురేష్ ప్రభు రైల్వే మంత్రిగా ఉన్నపుడు  2016 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. అయితే, అది అంతవేగంగా కార్యరూపం దాల్చలేదు.
ఇపుడు ఈ విధంగా రాబడి పెంచుకుని వచ్చిన ఆదాయంతో  ప్రయాణికులకు వరల్డ్ క్లాస్ సేలవందిస్తామని మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.