వెలగపూడి పంచాయతీ ఆఫీస్ వైసిపి రంగు మీద నల్లరంగు వేసిన రైతులు

అమరావతి: అమరావతిప్రాంతం లోని  వెలగపూడి లో పరిస్థితి ఉద్రిక్తం ఏర్పడింది. అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అక్కడి రైతులు ఆగ్రహించారు, ఇందులో వైసిపికార్యకర్తలే ముందున్నారు.. వెలగపూడి గ్రామ పంచాయతీ కార్యాలయానికి పూసిన  తమ పార్టీ రంగులు తుడిచేస్తామని ప్రకటించారు. వైకాపా కార్యకర్తలకు  గ్రామస్థులు  మద్దతు తెలిపారు. దీనితో సిఎం డౌన్ డౌన్ నినాదాలు వచ్చాయి. పోలీసులు అడ్డుకునేప్రయత్నం చేశారు.పోలీసుల్ని తోసి పంచాయతీ కార్యాలయానికి నల్ల రంగు పూశారు. కొంత నల్లరంగు పోలీసులు మీద కూడా పడింది.