కేంద్రంలో మరో సీనియర్ అధికారి కరోనా పాజిటివ్

కేంద్రంలో మరొక సీనియర్ అధికారి కోవిడ్-19 తో ఆసుపత్రిలో చేరారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ కె  ఎస్ ధత్వాలియా కరోనా పాజిటివ్ అని తేలడంతో  న్యూఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు.
నిన్న సాయంకాలం ఏడుగంటలకు ఆయన ఎయిమ్స్ తీసుకువచ్చినట్లు పిఐబి వర్గాలు తెలిపాయి. ఆయన ఇపుడు ఎయిమ్స్ ట్రామా సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. ఇపుడాయన ఆరోగ్యం ఎలా ఉందో తాజా సమాచారం లేదు.
థత్వాలియాకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన కార్యాలయం ఉన్న నేషనల్ మిడియాసెంటర్ ను మూసేశారు. భవనాన్ని మొత్తం శానిజైజ్ చేస్తున్నారు. ఇపుడ థత్వాలియా కాంటాక్టు లను కనుగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రెస్ కాన్ఫరెన్స్ లన్నీ ఇక నుంచి శాస్త్రి భవన్ లో జరుగుతాయి.
ఇప్పటికే రక్షణశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ (1985 బ్యాచ్ ఐఎఎస్ ) కరోనా పాజిటివ్ కావడంతో ఇంటివద్దే క్వారంటైన్ లో ఉంటున్నారు.