తమ్మినేని ‘కోర్టు’ వ్యాఖ్యల మీద హైకోర్టులో పిటిషన్

ఏపీ హైకోర్టులో స్పీకర్ తమ్మినేని సీతారాం పై పిటిషన్ దాఖలయింది. కోర్టు లపై తమ్మినేని ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. వాటిని ఆధారంచేసుకుని  బిజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు ఈ పిటిషన్ దాఖలు చేశారు.  న్యాయ వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లేలా స్పీకర్ తమ్మినేని  వ్యవహరించారనిపిటిషనల్ లో పేర్కొన్నారు.
పాలసీవ్యవహారాలలో కూడ కోర్టులు ప్రభుత్వాలకు ఆదేశాలస్తున్నాయని గత వారం స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యానించారు.
‘ నువ్వు ఈ పని చేయి,ఆపని చేయి, అక్కడి వెళ్లు, ఇక్కడికి రా అంటూకోర్టులు ఆదేశించడం మొదలుపడితే, ఇక ఈ ఎన్నికలు, వోట్లు, ఎమ్మెల్యేలు, ఎంపిలు ఉండేదెందుకు? మనకు అసెంబ్లీ ఉండేదెందుకు? ముఖ్యమంత్రిని, స్పీకర్ ను ఎన్నుకునేదెందుకు?,’ సీతారాం  చిత్తూరులో విలేకరులతో మాట్లాడుతూ ఆగ్రహించారు.
ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను హైకోర్టు రద్దుచేయడం మీద  మాట్లాడుతూ స్పీకర్ సీతారాం ఈ వ్యాఖ్య లు చేశారు.