నవరత్నాలు మీసొమ్ము కాదుగా, ప్రజల సొత్తేగా : పవన్ కల్యాణ్

నవరత్నాలు అని చెబుతు అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్  పార్టీ పండగచేసుకోవడానికి జనసేన నేత అభ్యంతరం చెప్పారు. ఇదంతా ప్రజల సొమ్మే కాని, వైసిపి నేత సమ్మేం కాదని వ్యాఖ్యానించారు.
 ఈ రోజు ఆయన వైసిపి నేతలు తన మీద సాగిస్తున్న వాగ్యుద్ధానికి ట్విట్టర్ లో స్పందించారు.
నవరత్నాలు పెట్టినా, 99 రత్నాలు పెట్టినా సరే ప్రజల పన్నుల డబ్బుతో ఇస్తున్నారు తప్ప మీ జేబులో డబ్బు ఇవ్వట్లేదు. పసుపు కుంకుమ అంటూ  డబ్బు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడిని ఎలా సాగనంపారో తర్వలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని కూడా సాగనంపుతారు అని ఆయన వ్యాఖ్యానించారు.
వచ్చేది జనసేన ప్రభుత్వం  మని కూడా ఆయన చెప్పారు. “ వచ్చేసారి జనసేన ప్రభుత్వం వస్తుంది. అపుడు మళ్లీ  ఈ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది టికెట్ల కోసంవస్తారు. వారు ఎవరో కూడా మాకు తెలుసు,’  అని పవన్ అన్నారు.
తాము ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానిని తప్పు పట్టి బూతులు మాట్లాడితే, మేము కూడా మీ రాజకీయం చేస్తాం. అధికారంలోకి  రావడానికి ఎలాంటిపనులు చేయాలో అలాంటి పనులు మేమూ చేయగలం, జాగ్రత్త ’ అని ఆయన హెచ్చరించారు.
‘మా కార్యకర్తలు కూడా వైసిపి నేతలను తిట్టడం మొదలుపెడితే, మీద పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోండి. ఒక్కడ ఆంధ్రప్రదేశ్ లో  మాత్రమే ఉన్న దౌర్భాగ్య పరిస్థి ఇది, ’ అని పవన్ అన్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *