డాక్టర్ అబ్దుల్ కలామ్ పేరు తీసేసి వైఎస్ పేరా, ఇదేం పని : పవన్ కల్యాణ్ ప్రశ్న

ఆంధ్రప్రదేశ్   ప్రతిభ పురస్కారాలకు విశ్వ విఖ్యాత మిసైల్ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రతపి  అబ్దుల్ కలామ్  పేరు మార్చడం ఏ మాత్రం  సమంజసం కాదని, అది ఆమోదయోగ్యం కాదని జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు  కార్యకర్తలతో మాట్లాడుతు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ దానికి సంబంధించిన జివొను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పవన్ ఇంకా ఏమన్నారంటే…
* దేశానికి మిసైల్ పరిజ్ఞానం ఇచ్చిన మహనీయులు డాక్టర్ కలామ్ .
ఆయన పేరిట ఉన్న పురస్కారానికి సీఎం  నాన్న గారి పేరు ఎలా పెడతారు?
* మీ నాన్నగారి పేరు చాలా పథకాలకు పెట్టారు కదా. ఇంకా  కావాలంటే కొత్త పథకాలకు పెట్టుకోండి. ప్రతిభ పురస్కారానికి  మాత్రం పెట్టకండి.
* జాతికి సేవలు చేసినవారిని గౌరవించడం తెలియదా… వారికి ఇచ్చే మర్యాద ఇదేనా?
* జాతీయ పతాకాన్ని గౌరవించ లేని వారికి జాతికి సేవ చేసిన వారి విలువ ఏం తెలుస్తుందిలే?
* ప్రజా వ్యతిరేకత చూసి పొద్దున్నే – నాకు తెలియదు అంటున్నారు..
*ఆ జీవో ఇచ్చిన వారిని తక్షణం సస్పెండ్ చేయాలి.
* సస్పెండ్ చేయలేదు అంటే ప్రభుత్వం జాతికి సేవ చేసిన వారికి ద్రోహం చేసినట్లే