పాడేరు మెడికల్ కాలేజీ ఏర్పాాటుకు స్థలం రెడీ: ఆళ్లనాని

విశాఖ పట్నం జిల్లా  పాడేరులో నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీ స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పరిశీలించారు. ఆయనతో పాటు  మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణ దాసు, అరకు ఎంపీ మాధవి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు.
తొందర్లో ఈ మెడికల్ కాలేజీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకు స్థాపన చేస్తారు. దాదాపు 35 ఎకరాల విస్తీర్ణంలో ఈ మెడికల్ కాలేజీ ఏర్పాటువుతున్నది. పాడేరు లోని ప్రభుత్వ పాలిటీక్నిక్ కాలేజీ సమీపంలో ఖాళీగా ఉన్న 50ఎకరాల స్థలాన్ని మెడికల్ కాలేజీ ఏర్పాటుకోసం మంత్రి  పరిశీలిoచారు.
పాడేరు లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు కు నిధులు మంజూరయ్యారు. భవనాల నిర్మానాన్ని చెపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేశారు.
విశాఖపట్నం మన్యం లో గిరిజనులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని.. సత్వరమే ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ఆదేశించడంతో మంత్రి ఆళ్ల నాని ఈ పర్యటనకు వచ్చారు.
నేటి నుండి ఉత్తరాంధ్ర  జిల్లాలలో ఆయన రెండు రోజులు పాటు పర్యటిస్తారు.
ఈ సంద్భంగా మాట్లాడుతూ  రాష్ట్ర వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని, ఇందులో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరయిందని మంత్రి నాని చెప్పారు.  రాష్ట్రములో ప్రస్తుతం ఉన్న 11ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అదనంగా  మరో 16ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు.
‘ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న జిల్లా హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్ ను భోధనాహాస్పిటల్స్ గా అభివృద్ధి చేయాలన్నది  ముఖ్యమంత్రి నిర్ణయం. రానున్న మూడు సంవత్సరాలలో కొత్తగా మంజూరు అయినా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తి చేస్తాం,’ అని ఆయన చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ప్రజలకు  వైస్సార్ విలెజ్ క్లినిక్ లు అందుబాటులోకి రానున్నాయని, రాష్ట్రలో ప్రతి 2వేల జనాభాను ఒక యూనిట్ గా తీసుకొని అక్కడ పరిస్థితులకు అనుగుణంగా విలెజ్ క్లినిక్ లు ఏర్పాటు చేయాలని సీఎం అదేశించారని ఆయన వెల్లడించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
గ్రామ, వార్డ్, సచివాలయాలలో ఇకపై ప్రాధమిక వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వఉద్దేశ్యం. పట్టణ, గ్రామీణ, ప్రాంతాలలో ఎవరికైనా అనారోగ్యం ఏర్పడితే తక్షణమే ఉచితంగా వైద్యం అందించడానికి విలెజ్ క్లినిక్ లు దోహతపడతాయి. ప్రతి టీచింగ్ హాస్పిటల్స్ లో డెంటల్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో అత్యదునిక పరికరాలను సమకూరుస్తాము.పూర్తి స్థాయిలో వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించడానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నాం. రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సంకల్పం…..