ఏపీ లో జోరుగా లోకల్ ఎన్నికల ఏర్పాట్లు, పరిశీలకులు వీరే…

విజయవాడ:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థలకు ఎన్నికల పరిశీలకులు గా ఈ దిగువ పేర్కొన్న సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులను నియమించడం జరిగింది.
ఎన్నికల పరిశీలకులు గా 13 జిల్లాలకు సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించడం జరిగింది. వారితో పాటుగా మరో నలుగురు ఉన్నతాధికారులను రిజర్వు లో నియమించడం జరిగింది.
జిల్లాల వారిగా – కె. ఆర్.బి. హెచ్. ఎన్. చక్రవర్తి – కర్నూలు, శ్రీమతి. ఎం. పద్మ – కృష్ణ జిల్లా , శ్రీమతి. పి.ఉషా కుమారి – తూర్పు గోదావరి జిల్లా, శ్రీమతి. పి.ఎ. శోభా – విజయనగరం జిల్లా, కె. హర్షవర్ధన్ – అనంతపురం జిల్లా, టి. బాబు రావు నాయుడు – చిత్తూరు జిల్లా, ఎం. రామారావు – శ్రీకాకుళం జిల్లా, శ్రీమతి. కె. శారదా దేవి – ప్రకాశం జిల్లా , ప్రవీణ్ కుమార్ – విశాఖపట్నం జిల్లా, బి. రామారావు -ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా , పి. రంజిత్ బాషా – వైయస్ఆర్ కడప జిల్లా, కాంతిలాల్ దండే – గుంటూరు జిల్లా, హిమాన్షు శుక్లా – పశ్చిమ గోదావరి జిల్లా లకు నియమించారు.
వీరికి అదనంగా నలుగురు సీనియర్ ఉన్నతాధికారులను సిహెచ్. శ్రీధర్, శ్రీమతి. జి. రేఖ రాణి, శ్రీమతి టి.కె.రామమణి, ఎన్.ప్రభాకర్ రెడ్డి లను రిజర్వు లో ఉంచడం జరిగింది.