దయనీయంగా ఆంధ్రా తాహశీల్దార్ ఆఫీస్ లు, తక్షణ నిర్మాణానికి విజ్ఞప్తి

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 40 సంవత్సరాల క్రితం నిర్మించిన తహశీల్దార్ కార్యాలయాలు కొన్ని శిథిలావస్థకు చేరి ఉన్నందున వాటిని వెంటనే పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నేతలు బొప్పరాజు, చేబ్రోలు కృష్ణమూర్తి, గిరికుమార్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేవారు. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న తహశీల్దార్ కార్యాలయాలు పూర్తిగా దెబ్బతిని చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని వారు తెలిపారు. ఇలాగా కొన్ని చోట్ల నిర్మాణంలో ఉన్న భవనాలు నిధుల్లేక అసంపూర్తిగా కూడా ఉన్నాయని వారు తెలారు. తాశీల్దార్ కార్యాలయాల మీద తక్షణమే జిల్లా కలెక్టర్లు ద్వారా నివేదికలు తెప్పించుకుని ’నాడు – నేడు‘ కార్యక్రమం అవసరమయిన చోట నూతన భవనాలు నిర్మించాలని, పాక్షికంగా దెబ్బతిన్నచోట తగిన మరమ్మతులు వెంటనే చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.

శిథిలావస్థకు చేరిన ఒక తహశీల్దార్ కార్యాలయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని శిథిలావస్థలోవున్న ప్రభుత్వ పాఠశాల భవనాలను ‘నాడు-నేడు’ కార్యక్రమము ద్వారా జీర్ణోద్దారణ చర్యలు చేపట్టే సాహసోపేతమైన ఒక మంచి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కి వారు ధన్యవాదాలు తెలిపారు.

శిథిలావస్థకు చేరిన యాడికి మండలం, అనంతపురం జిల్లా తహశీల్దార్ కార్యాలయం…

ఇది అత్యంత అత్యంత శుభపరిణామమని అదే విధముగా ఈ పథకాన్ని ప్రభుత్వ భవనాలకుకూడా వర్తింపచేస్తే ఇంకా బాగుంటుందని వారు పేర్కొన్నారు. ‘ప్రభుత్వ పథకాల రూపకల్పనలో , అమలులో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న రెవిన్యూ శాఖకు సంభందించిన శిథిలావస్థలో వున్న కలెక్టర్, RDO ప్రత్యేకంగా తహశీల్దార్ కార్యాలయాలు కూడా చాలా ఉన్నాయి. వీటివల్ల వర్షా కాలములలో కురిసే వర్షాల, తుఫానులు వలన
1. అత్యంత విలువ కలిగిన రెవిన్యూ రికార్డులు తుడిచిపెట్టుకొనిపోయే ప్రమాదం ఉంది.

2. భవనాలు కూలిపోయి అటు రెవిన్యూ ఉద్యోగులకు ఇటు పనుల నిమిత్తము నిత్యమూ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ప్రాణ నష్టము జరిగే ప్రమాదం ఉంది.

3. మరీ ప్రత్యేకంగా సముద్ర తీర ప్రాంతంలో తుఫానులు సమయంలో తీర ప్రాంతం ప్రజలను (సైక్లోన్ షెల్టర్ బాగా లేనప్పుడు) కూడా తుఫాను తీరం దాటే వరకు తహశీల్దార్ కార్యాలయంలోనే వారందరిని rescue చేసి ఉంచినప్పుడు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి.

కావున ప్రభుత్వం తక్షణమే గత ప్రభుత్వం హయాంలో మొదలుపెట్టి నిధులు లేక నిర్మాణాలు ఆగిపోయిన దాదాపు 65 తహశీల్దార్, RDO కార్యాలయాలకు తగిన నిధులు వెంటనే విడుదల చేసి వాటి నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

(ఫీచర్డ్ ఫోటో: నిధులు లేక మధ్యలోనే నిర్మాణం ఆగిపోయిన కృష్ణా జిల్లా గన్నవరం తహసీల్దార్ కార్యాలయం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *