మే నెల 31 వరకు దేవాలయాల్లో దర్శనాల్లేవ్ : మంత్రి వెల్లంపల్లి

ఆలయాలలో దర్శనాలను అనుమతించేందుకు టిడిపి ఒక వైపు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఏర్పాట్లు చేస్తూ ఉందని వార్తలు వెలువడతున్నతరుణంంలో మే నెల 31 వరకు దేవాలయాల్లో భక్తులను అనుమతించడం లేదని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం లాక్ డౌన్ కాలపరిమితిని మే నెల 31వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో భక్తులకు దర్శనము లను నిలుపుదల  ఆదేశాలను కొనసాగించదలిచినట్లు ఆయన చెప్పారు.
అయితే, అన్ని దేవాలయాల్లో యధావిధిగా నిత్య పూజలు. సాంప్రదాయం ప్రకారం కొనసాగుతాయన్నారు..
అదే విధంగా ఆర్జిత సేవల కోసం ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరిపి పరోక్షంగా సేవలు అందించే విధంగా అన్ని దేవాలయాల్లో ఏర్పాటు చేసుకోవాలని కార్యనిర్వాహక అధికారులను మంత్రి ఆదేశించారు.