తిరుపతి సమీపాన తిష్టవేసిన నివార్ తుఫాన్

నివర్ తుఫాను తీవ్రవాయుగుండంగా కొనసాగుతున్నదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల  నిర్వహణ శాఖ ప్రకటించింది.
ఇది రాగల 6 గంటల్లో వాయుగుండంగా, ఆ తదుపరి అల్పపీడనంగా బలహీన పడనుంది.
తిరుపతికి పశ్చిమ నైరుతిగా 30 కీమీ దూరంలో , చెన్నైకి పశ్చిమ వాయువ్య దిశగా 115 కిలోమీటర్ల దూరంలో నివర్  కేంద్రీకృతమయి ఉంది.
దీని ప్రభావంతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల వ్యాప్తంగా గంటకు 55-75 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి.
శుక్రవారానికి నివర్ ప్రభావం తగ్గవచ్చు
రాగల రెండు రోజుల వాతావరణ వివరాలు: 
శుక్రవారం (27/11/2020) 
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి , కృష్ణా , గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయి.
శనివారం(28/11/2020)
కృష్ణా , గుంటూరు , ప్రకాశం , నెల్లూరు జిల్లాల్లో విస్తృతంగా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖ, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి ,రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయి.
వర్షాల నేపధ్యంలో వాగులు, వంకలు పొంగిపోర్లే అవకాశం ఉంది.
 ః
అందువల్ల లోతట్టు  ప్రాంత  ప్రజలు  అప్రమత్తంగా ఉండాలి.
రైతులు పంట సంరక్షణకై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *