కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి

సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. అనారోగ్యంతో జులై 29 న నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కరోనా పరీక్షలు చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు. నంది ఎల్లయ్య 6 సార్లు లోక్ సభకు 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన మృతిపై పలు పార్టీ నేతలు సంతాపం తెలిపారు.