మరొక అడుగు ముందుకేసిన మెట్రో రైల్ కారిడార్- II

జెబిఎస్ స్టేషన్ నుండి ఎం జి బి ఎస్ స్టేషన్ల వరకు మెట్రో రైల్ కారిడార్- II ట్రయల్ రన్ వైపు మరొక అడుగు ముందుకేసింది. పది కిలో మీటర్ల పొడవున్న  ఈ కారిడార్ లో ఈ రోజు ఓవర్ ఎలెక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టం (OETS) సి ఈ ఐ జీ పర్యవేక్షించింది.
​​కారిడార్- II లోని జెబిఎస్ స్టేషన్ నుండి ఎం జి బి ఎస్ స్టేషన్ల వరకు చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ (సిఇఐజి) డివిఎస్ రాజును ​ఈ తనిఖీ నిర్వహించారు.

​​ఈ 10 కిలోమీటర్ల కారిడార్‌లోని ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ (ఓఇటిఎస్) ఎంజిబిఎస్‌లోని హైదరాబాద్ మెట్రో రైలుకు చెందిన 132 కెవి / 33 కెవి / 25 కెవి రిసీవింగ్ సబ్‌స్టేషన్ (ఆర్‌ఎస్‌ఎస్) నుంచి మొదలవుతుంది.

​ఈ రిసీవింగ్ సబ్‌స్టేషన్కు ఇన్కమింగ్ సరఫరా ఇమ్లిబన్ వద్ద ఉన్న TS TRANSCO యొక్క 220kV / 132kV ప్రధాన సబ్‌స్టేషన్ నుండి తీసుకోబడింది.

దీనికి సంబంధించి, మెట్రో స్టేషన్లలో 33 kV / 415V సహాయక విద్యుత్ సరఫరా సబ్‌స్టేషన్లు ఇప్పటికే ప్రారంభించబడ్డాయి.

​తనిఖీ నిర్వహించిన తరువాత డివిఎస్ రాజు మాట్లాడుతూ ఈ విభాగంలో ఓఇటిఎస్ కు విద్యుచ్ఛక్తి నివ్వడం జెబిఎస్ – పరేడ్ గ్రౌండ్స్ నుండి ఎంజిబిఎస్ వరకు ట్రయల్ రన్  కోసం రైళ్ళను తరలించడానికి దోహదపడుతుందని అన్నారు.

​ఎల్ అండ్ టి మెట్రో రైల్ ఈ కారిడార్‌లోని అన్ని చట్టబద్ధమైన పరీక్షలను త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

​ఎల్ అండ్ టిఎంఆర్హెచ్ఎల్ యొక్క ఎండి & సిఇఒ కెవిబి రెడ్డి మాట్లాడుతూ  కారిడార్ II యొక్క వాణిజ్య కార్యకలాపాలను జెబిఎస్ – పరేడ్ గ్రౌండ్స్ నుండి ఎంజిబిఎస్ వరకు ప్రారంభించడానికి ఇది మరో అడుగు అని అన్నారు.

​కారిడార్ -2 ను పరిశీలించినందుకు డివిఎస్ రాజుకు కృతజ్ఞతలు చెప్పారు. ఇది మెట్రో రైలు యొక్క ఇతర వ్యవస్థలను పరీక్షించడానికి  తద్వారా అన్ని చట్టబద్ధమైన కార్యక్రమాలను పూర్తి చేసి   ట్రయల్ రన్ ప్రారంభించడానికి కూడా మాకు సహాయపడుతుందని ఆయన అన్నారు.