ఈ రోజు వైసిపికి మరచిపోలేని రోజు, ఇందుకే…

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ ప్రజా తీర్పు వెలువడిన ఈరోజు (May 23, 2019) చిరస్మరణీయమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా  అధికారం చేపట్టేందుకు నగరా మోగించిన ఈ రోజు. ఈ రోజే గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఫలితాలు ప్రభంజనం సృష్టించాయి. సాయంకానికల్లా వైసిసి అఖండ విజయం వైపు పరుగుబెట్టింది.
 ఈ  సందర్భంగా రాజ్యసభ సభ్యుడు, పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి  ట్విట్టర్ లో  హర్షం వ్యక్తం చేశారు.
‘తొమ్మిదేళ్ల పాటు ఎన్నెన్ని కుట్రలు. జైలుకు పంపడం. అభిమన్యుడిలా ఒంటిరివాడిని చేసి మట్టుపెట్టాలని చూశారు. కర్ణుడిలా అశక్తుడిని చేసి హతమార్చాలని స్కెచ్చులు వేశారు. ఆ గుండె ధైర్యం, పట్టుదలల ముందు ప్రత్యర్థులు తోక ముడవక తప్పలేదు. ప్రజలకు జీవితకాల భరోసాగా నిల్చాడు యువనేత’అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిన ఉద్దేశిస్తూ భావోద్వేగ ట్వీట్‌ చేశారు.