రేపటి నుంచి మంగళగిరి మెయిన్ బజార్ పూర్తిగా లాక్‌డౌన్‌

ఆంధ్రప్రదేశ్ లోని  మంగళగిరి పట్టణంలో పాక్షికంగా లాక్ డౌన్ విధించారు. మెయిన్ బజార్ లో రెండు కేసులు దానికి అనుబంధంగా ఉన్నటువంటి వార్డుల్లో కేసులు పెరగడంతో మంగళగిరి పట్టణం లో ఆరు వార్డుల్లో పూర్తిగా లాక్ డౌన్ విధించారు.   మెయిన్ బజార్ ను పూర్తిగా సివేస్తున్నట్లు మంగళగిరి మున్సిపల్ కమిషనర్ హేమ మాలిని రెడ్డి కొద్దిసేపటి క్రితం తెలిపారు.

మంగళగిరి పట్టణంలోని టిప్పర్ల బజారు, భార్గవ్ పేట కొప్పు రావు కాలనీ ద్వారకానగర్, ఆంజనేయ కాలనీ ,పాత మంగళగిరి 24 ,25 వార్డుల్లో కూడా పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దీనితో ఈ రోజు నుంచే మెయిన్ బజారు సరుకులు కొనేవారితో కిటకిట లాడటం మొదలయింది.