హైదరాబాద్ లో కోవిడ్ లేదు, ఐపిఎల్ నిర్వహించండి: కెటిఆర్

హైద్రాబాద్ లో ఐపిఎల్ నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, అందువల్ల తెలంగాణ రాజధానిలో ఐపిఎల్ మ్యాచ్ నిర్వహించాలని రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు బిసిసిఎల్ కు, ఐపిఎల్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ లో కోవిడ్ ప్రభావం పెద్దగా లేని విషయాన్ని కూడా వారికి ట్విట్టర్ ద్వారా గుర్తు చేశారు.

హైద్రాబాద్‌లో కోవిడ్ కేసులు బాగా తక్కువగా నమోదువుతన్నవిషయం చెబుతూ మిగిలిన మెట్రో నగరాలతో పోల్చుకుంటే కోవిడ్ విషయంలో హైదరాబాద్‌ చాలా మెరుగు అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఐపిఎల్ నిర్వహణలో  రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.

ఐపీఎల్ మ్యాచ్‌లకు చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీలను ఎంపిక చేశారని వార్తలు వస్తూండటంతో ఈ జాబితాలో హైదరాబాద్ ని కూడా చేర్చాలని కెటిఆర్ ఈవిజ్ఞప్తి చేశారు.

 

కెటిఆర్ ట్వీట్ కి స్పందన ఇలా ఉంది…

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *