10 నెలల తర్వాత 27న పట్టాలెక్కనున్న కృష్ణా ఎక్స్ ప్రెస్

కరోనా లాక్‌డౌన్‌ ప్రభావంతో నిలిచిపోయిన తిరుపతి నుంచి ఆదిలాబాద్‌ కృష్ణా ఎక్స్​ప్రెస్ (17406/17406)​ తిరిగి పట్టాలెక్కనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి సర్వీసు ప్రారంభం కానుంది. దాదాపు 10 నెలల విరామం అనంతరం ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తోంది.  ఈ రైలు మొత్తం 59 స్టేషన్లలో ఆగుతుంది. ప్రధానంగా ఏపీ, తెలంగాణ ప్రయాణికులతో పాటు తిరుపతి సందర్శించాలనుకునే మహారాష్ట్ర యాత్రికులకుఎంతో  ఉపయోగకరంగా రైలు ఇది.

ఇప్పటివరకు పండగ ప్రత్యేక రైళ్లుగా నడిపిన దక్షిణ మధ్య రైల్వే మరో నాలుగు జతల రైళ్లను 27, 28, 29 తేదీల నుంచి ప్రత్యేక రైళ్లుగా నడపనుంది.

వీటిలో సికింద్రాబాద్‌-మణుగూరు-సికింద్రాబాద్‌ (నెం.02745/02746),

కాచిగూడ-యల్హంక-కాచిగూడ (నెం.07603/07604),

గుంటూరు-రాయగడ-గుంటూరు (నెం.07244/07243),

కాకినాడపోర్టు-తిరుపతి-కాకినాడపోర్టు (నెం.07249/07250) రైళ్లు ప్రయాణికులు అందుబాటులోకి రానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *