KK మీద గౌరవం ఉంది, ఆయన రమ్మంటే చర్చలకు రెడీ: ఆర్టీసీ జెఎసి నేత

రాజ్యసభ సభ్యుడు, టిఆర్ ఎస్ సీినియర్ నాయకుడు కె కేశవరావు పొద్దున ఆర్టీసి సమ్మె మీద జారీ చేసిన ప్రకటన మీద   ఆర్టీసీ జెఎసి కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి స్పందించారు. ఆయన చేేసిన వ్యాఖ్యలివి…

కేకే అంటే మాకు గౌరవం ఉంది. ఉద్యమం సమయంలో ఎంతో కృషి చేశారు.

కేకే మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదే.

కేసీఆర్ గతంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తిస్తామని హామీకి కట్టుబడి ఉండాలి.

కేకే చర్చలకు ఆహ్వానిస్తే మేము చర్చలకు రావడానికి సిద్దం.

కొద్ది మంది మంత్రులు కార్మికులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.

గతంలో ఎర్రబెల్లి దయాకరరావు ఏం మాట్లాడడో, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయ్.

ఆర్టీసీ జెఎసి నాయకులు ఎక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు.

టీఎన్జీవో నేతలకు ఆర్టీసీ సమ్మె గురించి చెప్పలేదనడం సరికాదు.

ఉద్యోగ సంఘాల నేతలపై మాకు నమ్మకం ఉంది.